అందోల్, జూన్ 11: కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి.. రావాలే..దేశ ప్రజల బ్రతుకులు మారాలే అని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. రాష్ర్టాభివృద్ధిలో ఎలాగైతే ప్రజలు ఆయనకు అండగా ఉన్నారో దేశాభివృద్ధిలో సైతం అండగా ఉండాలని భారతదేశ..దశ..దిశ మార్చే సత్తా కేవలం సీఏం కేసీఆర్కే ఉన్నదని పేర్కొన్నారు. శనివారం వట్పల్లి మండలంలోని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. దేశ రాజకీయాల్లో స మూల మార్పులు జరగాల్సిన అవసరం ఉన్నదన్నా రు. కేసీఆర్తోనే నవభారత్ నిర్మాణం జరుగుతాదని రాష్ట్ర ప్రజలతో పాటు అన్ని రాష్ర్టాల ప్రజలు గట్టిగా నమ్ముతునాన్నరని చెప్పిన ఎమ్మెల్యే కేసీఆర్ దేశికి నేత అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి త్వరలో భారత రాష్ట్ర సమితిగా అవతరించాలని ఇదీ నా ఒక్కడి కోరిక మాత్రమే కాదని.. యావత్ దేశ ప్రజలు అంటున్న మా ట అన్నారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి దేశానికి రోల్మాడల్గా నిలబెట్టారో దేశాన్ని సై తం అన్ని దేశాలకు ఆదర్శంగా నిలుపుతారని కేసీఆర్పై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. ఏండ్లకు.. ఎండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్-బీజేపీ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. ఈ సందర్భంగా దేశ్కి నేత కేసీఆర్..కేసీఆర్ రావాలే.. దేశ ప్రజల తలరాతలు మార్చా లే అంటూ ప్రజలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు.
ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్ చేరికలు
అందోల్, జూన్ 11: ప్రతి పక్షాలు ఈ అభివృద్ధి మా కొద్దు.. రాజకీయాలే ముద్దు అంటూ అడుగడునా అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నాయి. శుక్రవారం వట్పల్లి మండలం షాద్నగర్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు ఎమ్మెల్యే వెళ్లగా దీన్ని సై తం అడ్డుకోవాలని చూసిన కాంగ్రెస్ నేతలు నవ్వులపాలయ్యారు. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్శితులైన పలువురు నేతలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు.