చిలిపిచెడ్, మే 20 : నీటిపారుదలశాఖ గుర్తించిన హద్దుల ప్రకారం భూసేకరణ చేయడమే రెవెన్యూ అధికారుల పని అని నర్సాపూర్ ఆర్డీవో వెంకటఉపేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం శీలాంపల్లి గ్రామ శివారులోని కాళేశ్వరం కాల్వ పనుల హద్దులను పరిశీలించారు. కాగా, సర్వే నెంబర్ 308లో వెళ్లాల్సిన కాల్వ సుమారు 400 మీటర్ల దూరం నుంచి వెళ్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ పాత సర్వే ప్రకారం కాల్వ పనులు చేయాలని కోరారు.
ఈ సందర్భం గా ఆర్డీవో మాట్లాడుతూ.. ప్రభుత్వం సూచించిన విధంగా భూ సేకరణ చేస్తామన్నారు. కాల్వ నిర్మాణ పనులనే మార్చే ప్రతిపాదనను ఉన్నతాధికారులకు వివరిస్తానన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు గుర్తించి స్థల సేకరణ భూమికి హద్దులు చూపిస్తామన్నారు. దీంతో ఆర్డీవోతో రైతులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యేతో కాల్వ సమస్యపై మాట్లాడుతానని ఆర్డీవో హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ కమలాద్రి, ఆర్ఐ నాగరాజు, రైతులు ఉన్నారు.