చేగుంట/ హవేళీఘనపూర్, మే 18 : చేగుంట, హవేళీఘనపూర్ మండలాల్లో బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్ పర్యటిం చి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెంది, ఆధైర్యపడొద్దని ప్రభుత్వం ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తుందని అదనపు కలెక్టర్ రమేశ్ పేర్కొన్నారు. చేగుంట మండలంలోని రెడ్డిపల్లి, వడియారం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ.. రుతుపవనాలు సమీపిస్తున్నందున ధాన్యం సేకరణ వేగవంతం చేయాలని నిర్వాహకులకు సూచించారు. తూకం వేసిన బస్తాలను లారీల్లో లోడ్ చేసిన వెంటనే సంబంధిత రైస్మిల్లుకు తరలించి, ట్యాబ్లో వివరాలను నమోదు చేయాలని సూచించారు.
రైస్ మిల్లర్లు కూడా లారీల్లో వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఖాళీ చేయించాలని, అవసమైతే హామాలీలను నియ మించుకోవాలని, మిల్లు సామర్థ్యానికి తగినట్లుగా గోదాంలు ఏర్పాటు చేసుకోవాలని రైస్ మిల్లర్ల యజమానులకు అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. రైతులు కూడా తేమ, తాలు లేకుం డా శుభ్రమైన ధాన్యాన్ని తేవాలని, ధాన్యం తడవకుండా టా ర్పాలిన్లు కప్పాలన్నారు. తడిసిన ధాన్యం సరైన విధానంలో ఆరబెట్టి నిబంధనలకు అనుగుణంగా కేంద్రాలకు తీసుకు రావాలని రైతులకు సూచించారు. ధాన్యం సేకరణపై వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ లక్ష్మణ్బాబు, అధికారులు ఉన్నారు.
రైతులు అధైర్యపడొద్దు : అదనపు కలెక్టర్
రైతులు ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే పూర్తి ధాన్యం తరలించే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని అదనపు కలెక్టర్ రమేశ్ వివరించారు. హవేళీఘనపూర్ మండలకేంద్రంతోపాటు మద్దుల్వాయి, కూచన్పల్లి, ముత్తాయిపల్లి గ్రామాల్లోని ధాన్యం కొ నుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. లారీల్లో ధాన్యం తరలించే సమయంలో ఎవరైనా డబ్బులు అడిగితే అధికారుల కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరామ్, మండల కో-అప్షన్ సభ్యులు ఖాలేద్, తహసీల్దార్, శ్రీనివాస్శర్మ, ఏవో నాగమాధురి తదితరులు ఉన్నారు.
ధాన్యం సేకరణలో వేగం పెంచాలి
వెల్దుర్తి/ చిలిపిచెడ్/ రామాయంపేట రూరల్, మే 18 : ధాన్యం సేకరణలో అధికారులు వేగం పెంచాలని, రైస్మిల్లుల యజమానులు సహకరించి ధాన్యాన్ని త్వరగా తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి సుభాషిణి అన్నారు. వెల్దుర్తితో పాటు మండలంలోని ఉప్పులింగాపూర్, కుకునూర్ గ్రామాల్లో ఉన్న రైస్మిల్లులు, కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ రమేశ్గౌడ్, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీవో జగదీశ్వరాచారితో కలిసి పరిశీలించారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహించరాదని, వేగంగా తూకం వేసి వెంటనే రైస్మిల్లులకు పంపించాలని, కొనుగోలు పూర్తికాగానే ట్రాక్షీట్ను రాసి ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. రైస్మిల్లుల యజమానులు సైతం వచ్చిన ధాన్యా న్ని వెంటనే తీసుకోవాలన్నారు. కొన్ని రైస్ మిల్లుల యజమానులు ధాన్యం తీసుకోవడం లేదన్నారు. వర్షాలు కురుస్తుండడంతో ధాన్యం తడిసిపోతుందని, రైతులు ఆందోళన చెందొద్దని, పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర : నర్సాపూర్ ఆర్డీవో
కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర లభిస్తుందని నర్సాపూర్ ఆర్డీవో రవీందర్రెడ్డి అన్నారు. చిలిపిచెడ్ మండల పరిధిలోని గంగారం, అజ్జమర్రి, బండపోతుగల్, ఫైజాబాద్ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతు లు ధాన్యంలో తాలు, మట్టి, పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకరావాలన్నారు. లారీల కొరత లేకుండా చూస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట తహసీల్ధార్ కమలాద్రి ఉన్నారు.
కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు ఉండవు..
ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రామాయంపేట మహిళా సమైఖ్య సీసీ వెంకట్రాజం అన్నారు. రామాయంపేట మండలం ఝన్సీలింగాపూర్లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఆయన వెంట సీఏ అనిత, నర్సమ్మ, యశోద ఉన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన తహసీల్దార్..
మాసాయిపేట మండలకేంద్రంతోపాటు గ్రామాల్లో కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసింది. మాసాయిపేటలో తడిసిన ధాన్యాన్ని తహసీల్దార్ మాలతి, సర్పంచ్ మధుసూదన్రెడ్డి, సొసైటీ డైరెక్టర్ నర్సింహులు, ఆర్ఐ ధన్సింగ్ పరిశీలించారు. ధాన్యం సేకరణ పూర్తి చేస్తామని వివరించారు.