సంగారెడ్డి అర్బన్, మే 12 : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మనఊరు-మనబడి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, చేపట్టే పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి సూచించారు. గురువారం జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన 1, 2, 4, 7వ స్థాయీ సం ఘాల సమావేశాలు జరిగాయి. మనఊరు-మనబడి, విద్య, వైద్యం,గ్రామీణాభివృ ద్ధి, పనులు, ఆర్థిక ప్రణాళిక అంశాలపై ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడు తూ.. మనఊరు – మనబడి గొప్ప కార్యక్రమమని, నాణ్యతతో కూడిన పనులు చేపట్టి పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దాలన్నారు. గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులు సక్రమంగా చేపట్టాలన్నారు. సీజనల్ వ్యాదులపై అప్రమత్తంగా ఉండాల ని, చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ప్రజా పరిషత్ నిధులు, వ్యయాలపై చర్చించారు. సమావేశంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, సభ్యులు రాఘవరెడ్డి, కుమార్గౌడ్, అరుణారెడ్డి, లలిత, రమేశ్, ఆంజనేయులు, నర్సింహరెడ్డి, మల్లికార్జున్పాటిల్, సుధాకర్రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.