ఝరాసంగం, ఏప్రిల్ 19: గ్రామీణ ప్రాంత నిరుపేదలకు ఉపాధి కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశ పెట్టాయి. ఇది నిరుపేద కుటుంబాలకు వరంలా మారింది. ఉపాధి పనులు మండలంలో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో పల్లెల్లో వ్యవసాయ పనులు అంతగా లేవు. దీంతో ఉపాధి హామీ పనుల వైపు కూలీలు పరుగు లు తీస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం దినసరి కూలీ రూ. 245 చెల్లిస్తున్నది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కూలీలకు దినసరి కూలీ రూ. 257లు చెల్లించనున్నారు. వేతనం పెంచడంతో నిరుపేద కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో జోరుగా ఉపాధి హామీ పనులు
ఝరాసంగంతో పాటు, కుప్పాగనర్, ఎల్గొయి, బర్దిపూర్, పొట్టిపల్లి, మాచ్నూర్, బిడెకన్నె, ఈదులపల్లి, జీర్లపల్లి, ఈదులపల్లి, చిల్కేపల్లి, చిలేమామిడి, చిలపల్లి, సిద్ధా పూర్ తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మ రంగా కొనసాగుతున్నాయి. దీంతో పాటు అటవీ భూము ల్లో నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భూగర్భ జలాలు పెంచేందుకు ఉపాధి హామీ పథకం ద్వారా చర్యలు తీసుకుంటున్నది. ఎండ తీవ్రత ఉండటం వల్ల కూలీలు ఉదయమే పనులకు వెళ్తున్నారు.
3586 మంది కూలీలు..
ప్రస్తుతం మండలంలో 10,450 జాబ్ కార్డులు ఉన్నా యి. 3586 మంది కూలీలు ఉన్నారు. ఏప్రిల్లో దాదాపు 3000మంది కూలీలు ఉపాధి పనులు చేస్తున్నారు. అత్యధికంగా కుప్పానగర్ గ్రామ పంచాయతీలో 280మంది కూలీలు, దేవరంపల్లి గ్రామ పంచాయతీలో 110జాబ్ కార్డులు ఉండగా అందులో 25మంది కూలీ లు పనులకు వస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో కందకా లు, వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు మట్టి రోడ్లు, మళ్లింపు కాలువల నిర్మాణ పనులు చేస్తున్నారు.
ప్రతి కూలీకి పని కల్పిస్తాం..
జాబ్కార్డు ఉన్న ప్రతి ఒ క్కరికీ ఉపాధి పని కల్పిస్తాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాబ్కార్డు ఉన్న ప్రతి ఒక్కరి కీ 100రోజుల ఉపాధి కల్పిస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్యదర్శులు వద్ద పనికి వచ్చే కూలీలు తమ పేర్లు, గ్రూప్ పేర్లను నమోదు చేసుకోవాలి. ఉపాధి పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి పనులు ముమ్మరం కావడంతో కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పనులు చేసేటప్పుడు కూలీలు జాగ్రత్తలు పాటించాలి.
– ఎంపీడీవో సుజాత (ఝరాసంగం)
అర్హులకు జాబ్ కార్డులు మంజూరు చేస్తాం..
సాప్ట్వేర్ ఆప్డేట్ తర్వాత కొత్త జాబ్కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తాం. అర్హుల కు కార్డులు మంజూరు చేస్తాం. అడిగిన ప్రతి కూలీకి పని కల్పి స్తున్నాం. ప్రస్తుతం ఏప్రిల్ నుంచి కూలీలకు వేసవి భత్యం రూ. 257లకు పెరిగింది. పనికి తగ్గ కూలీని కూలీలకు చెల్లిస్తున్నాం. ప్రస్తుతం మండలంలో దా దాపు 3వేల మంది వరకు కూలీలు పనులకు వస్తున్నారు. ఉపాధి హామీ నిరుపేద కుటుంబాలకు ఎంతో అసరాగా నిలుస్తున్నది.
– ఏపీవో రాజ్కుమార్ (ఝరాసంగం)