గవ్వలపల్లి చౌరస్తాలో యాదేశ్వర్ సంస్కరణ సభ
హాజరైన మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
చిన్నశంకరంపేట, మార్చి 13 : ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడి ప్రజల గుండెల్లో నిలిచిన దూడ యాదేశ్వర్ స్ఫూర్తినీయు డని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కొనియాడారు. చిన్నశంకరంపేట మండలంలోని గవ్వలపల్లి చౌరస్తా లో ఆదివారం నిర్వహించి యాదేశ్వర్ సంస్కరణ సభకు ఎమ్మెల్యే హాజ రయ్యారు. ఈ సందర్భంగా యాదేశ్వర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మా ట్లాడుతూ.. యాదేశ్వర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యాదేశ్వర్ కుటుంబ సభ్యులకు తనవంతు సహకారాన్ని అం దిస్తానని హామీ ఇచ్చారు. అనంతరంవెంకట్రావుపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సోమేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాల్లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో గొర్రెలు, మేకల పెంపకందారుల సహకార సం ఘం ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ శ్రీహరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రాజు నగేశ్, నాయకులు శంకర్, బాల్రాజ్గౌడ్, అల్లారం రత్నయ్య, రాజు, యాదగిరి, న్యాయవాది రేణుక, యాదవరావు, మల్లేశం పాల్గొన్నారు.
కల్లంపేట యాదగిరిగౌడ్ చిరస్మరణీయుడు
మెదక్ మున్సిపాలిటీ, మార్చి 13 : మున్సిపల్ మాజీ కౌన్సిలర్, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ కల్లంపేట యాదగిరిగౌడ్ సంవత్సరీక కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరయ్యారు. యాదగిరిగౌడ్ చిరస్మరణీయుడిని నివాళులర్పించారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ అశోక్, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, కిశోర్, టీఆర్ఎస్వీ రా్రష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్, నేతలు ప్రభురెడ్డి, మధు పాల్గొన్నారు.