సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 10: బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే చర్యలు తప్పవని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగిన పలువురికి రూ.200 జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి విష్ణువర్ధన్రెడ్డి మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బహిరంగ ప్రదేశాలు, పబ్లిక్ ప్రదేశాల్లో పొగ తాగడం నిషేధమని, లేని పక్షంలో జరిమానాలు విధించడం తప్పవన్నారు. పొగాకు ఉత్పత్తులపై ప్రచారం నిషేధమని గుర్తు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే రెండు నుంచి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.5 వేల వరకు జరిమానా ఉంటుందని వివరించారు. విద్యాలయాల చు ట్టూ 100 గజాలలోపు పొగ తాగడం, ఉత్పత్తులపై అమ్మ కం నిషేధించినట్టు వెల్లడించారు. పొగాకు నిషేధ చట్టం-2003పై ప్రజలకు వారు అవగాహన కల్పించారు. ఈ తనిఖీల్లో వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.