పెద్దశంకరంపేట, నవంబర్ 26 : పోస్టాఫీసుల్లో నగదు రహిత యూపీఐ ట్రాన్జక్షన్లను ప్రోత్సహించాలని తపాలా ఉద్యోగులకు సం గారెడ్డి డివిజన్ పోస్టల్ ఎస్పీ ఎస్వీఎల్ఎన్ రావు సూచించారు. శనివారం పెద్దశంకరంపేట సబ్ పోస్టాఫీస్ను సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ పోస్టాఫీస్లో రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీఎస్ఐలో ఎక్కువగా ట్రాన్జక్షన్లు నిర్వహించిన సబ్ పోస్ట్ మాస్టర్ అనిల్కు బహుమతి అందజేసి, అభినందించారు. కష్టపడి పనిచేసేవారికి ప్రోత్సాహకాలను అందజేస్తూ ప్రోత్సహిస్తామన్నారు. అన్ని పోస్టాఫీసుల్లో స్పీడ్ పోస్ట్ బుకింగ్, రిజిష్టర్ బుకింగ్, రిజిష్టర్ పార్సిల్ బుకింగ్, స్టాంప్స్ అమ్మకం, నగదు చెల్లింపులను నగదు రహిత లావాదేవీలు చేసేలా ఖాతాదారులను ప్రోత్సహించాలన్నా రు. సంగారెడ్డి డివిజన్లోని పోస్టాఫీసుల్లో నగదు రహిత లావాదేవీలు చేసుకునే అవకాశం ఉందన్నారు. సుకన్య సమృద్ధి యోజనపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సంగారెడ్డి సబ్ డివిజనల్ మెయిల్ ఓవర్సిర్స్ శ్రీనివాస్, శంకర్, సబ్ పోస్ట్ మాస్టర్ అనిల్, పోస్ట్ మాస్టర్ మాణయ్య పాల్గొన్నారు.