గజ్వేల్, నవంబర్ 25 : గజ్వేల్కు సబ్కోర్టు త్వరలోనే రానున్నది. కొద్ది రోజులుగా గజ్వేల్ న్యాయవాదులు గజ్వేల్లో సబ్కోర్టు, కోర్టు నూతన భవనాన్ని మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎఫ్డీసీ చైర్మ న్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏ ఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ న్యాయవాదులతో కలిసి మంత్రి హరీశ్రావును విన్నవించారు. వెంటనే మంత్రి స్పందిస్తూ న్యా యశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డికి విషయాన్ని తెలియజేశారు. ఇంద్రకరణ్రెడ్డిని కలువాలని న్యాయవాదులకు హరీశ్రావు సూచించారు. మంత్రి సూచనల మేరకు న్యాయవాదులు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్తో కలిసి శుక్రవారం న్యాయశాఖ మంత్రి ఇందకరణ్రెడ్డిని కలిసి గజ్వేల్లో సబ్కోర్టు అవసరం, కోర్టు నూతన భవన ఆవశ్యకత గురించి వివరించారు. అందుకు మంత్రి వెంటనే స్పం దించి సంబంధిత ఫైల్ను వెంటనే ఫార్వర్డ్ చేయాలని న్యాయశాఖ కార్యదర్శిని ఆదేశించారు. న్యా యవాదులు సంతోషం వ్యక్తం చేస్తూ మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, హరీశ్రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో న్యాయవాదులు అశోక్రెడ్డి, పార్థసారథి, భాస్కర్రావు, భాస్కర్, కనకయ్య తదితరులు ఉన్నారు.