కొండాపూర్, నవంబర్ 25: నేటి అభినవ గాంధీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. శుక్రవారం కొండాపూర్ మండలం లో అనంతసాగర్, సైదాపూర్, మారేపల్లి, మాచేపల్లి, దొబ్బకుంట, శివన్నగూడెం, గంగారం, మాందాపూర్, సీహెచ్ కోనాపూర్, మన్సాన్పల్లి గ్రామాల్లో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్డిఎఫ్ నిధుల ద్వారా సీసీ రోడ్ల పనులను ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి కేసీఅర్ నారాయణఖేడ్లో నిర్వహించిన సభలో ప్రతి గ్రామానికి రూ. 20లక్షలు మంజూరు చేస్తానని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ పనులు నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావులు అభివృద్ధిలో ఇతర రాష్ర్టాల్లో కంటే తెలంగాణ రాష్ర్టాన్ని ముందుంచుతున్నారన్నారు.
సీఎంఆర్ఎఫ్ కింద రూ. 17కోట్లు కేవలం సంగారెడ్డికి అందించారన్నారు. ప్రతి గ్రామానికి రూ. 20 లక్షలు మంజూరు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. మారెపల్లిలో సొసైటి గోదాం నిర్మాణానికి రూ. 19.50 లక్ష లతో భూమి పూజ చేశామన్నారు. కేవలం కొండాపూర్ మండలానికి రూ. 4.80కోట్లు మంజూరయ్యాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్డును కూడా ఏర్పాటు చేయలేరన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలని డంపింగ్యార్డు, క్రీడా ప్రాంగణం, పల్లెప్రకృతి, శ్మశానవాటిక, వాటర్ ట్యాంకర్, ట్రాక్టర్లను అందిచామన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ మనోజ్రెడ్డి, జడ్పీటీసీ ప ద్మావతి పాండురంగం, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, వైస్ ఎంపీపీ లక్ష్మీరాంచందర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షు డు రుక్ముద్దీన్, టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మ్యాకం విఠల్, సర్పంచ్లు నర్సింహులు, వెంకటేశంగౌడ్, రాములునాయ క్, ప్రకాశం, టీఆర్ఎస్ నాయకులు మల్లాగౌడ్, జగదీశ్వర్, ప్రభాకర్, మోహన్గౌడ్, సొసైటి చైర్మన్ రాజు, ఎంపీటీసీలు కాంతయ్య, రాందాస్, జడ్పీ కో-ఆప్షన్ సభ్యులు అమినోద్దీన్, నాయకులు గోవర్ధన్రెడ్డి, రఘనాథ్రెడ్డి, జలీల్, ప్రభుదాస్, కుమార్, గురుకిరణ్, నషీర్, రవి పాల్గొన్నారు.