రామాయంపేట, నవంబర్ 21 : జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్లు అంతా సంఘటితంగా ఉండాలని జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు మానెగళ్ల రామకిష్టయ్య అన్నారు. సోమవారం మండలంలోని ఝాన్సీలింగాపూర్లో ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ముదిరాజ్లమంతా సంఘటితంగా ఉంటేనే ప్రభుత్వ ఫలాలు దక్కుతాయన్నా రు. కార్యక్రమంలో జిల్లా నాయకుడు పుట్టి అక్షయ్కుమార్, గ్రామ కమిటీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
మెదక్రూరల్, నవంబర్ 21: రాష్ట్ర యువత అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్, ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మండలంలోని మంబోజిపల్లి నుంచి జానకంపల్లి వరకు ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదిరాజ్లను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చాలన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, మండ ల ఉపాధ్యక్షుడు సాయికుమార్, సర్పంచ్ శ్యామమ్మ, సం ఘం అధ్యక్షుడు కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.
కొల్చారం, నవంబర్ 21: మండలంలోని పోతంశెట్పల్లిలో సోమవారం ముదిరాజ్ జెండాను యువత అధ్యక్షుడు కాసాని వీరేశ్ ముదిరాజ్ ఆవిష్కరించారు. అనంతరం మెద క్ మండలంలోని జానకంపల్లిలో జెండావిష్కరణకు 150 మోటార్సైకిళ్లతో ర్యాలీ వెళ్లారు. కార్యక్రమంలో పోతంశెట్పల్లి గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పోచయ్య ముదిరాజ్, కొల్చారం జడ్పీటీసీ మేఘమాల సంతోశ్ ముదిరాజ్, సర్పంచ్ నాగరాణి నర్సింహులు పాల్గొన్నారు.
టేక్మాల్, నవంబర్ 21: మండలంలోని బొడ్మట్పల్లిలో సోమవారం ప్రపంచ మత్య్సకారుల దినోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఉత్తులూరి నర్సింహులు, మత్య్సకారుల సహకార సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రవీణ్, ఉపాధ్యక్షుడు కాసాల నాగభూషణం, సంఘం సభ్యులు కాసాల కిష్టయ్య, గడ్డం దుర్గయ్య పాల్గొన్నారు.
అల్లాదుర్గం, నవంబర్ 21: ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని మండలంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ముదిరాజ్ జెండాను ఆవిష్కరిచా రు. కార్యక్రమంలో అల్లాదుర్గం మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు భూమయ్య, లక్ష్మయ్య, నర్సింహులు, బేతయ్య, పాండు, వీరేశం పాల్గొన్నారు.
పాపన్నపేట, నవంబర్ 21 : పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకుని వివిధ గ్రామాల్లో పతాకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు.