పాపన్నపేట, నవంబర్20: ఏడుపాయల పుణ్యక్షేత్రంలో వనదుర్గాభవానీమాతను దర్శించుకునేందుకు ఆదివా రం భారీగా భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ఏడుపాయలకు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం కిటకిటలాడింది. భక్తులు ముందుగా మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది సూర్యశ్రీనివాస్, మధుసూధన్రెడ్డి, రవివీర్కుమార్, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. వేద పండితులు శంకరశర్మ, పార్థీవశర్మ అమ్మవారికి పూజలు చేశారు. ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్సై విజయ్కుమార్ బందోబస్తు ఏర్పాటుచేశారు.