ప్రపంచ మరుగుదోడ్ల దినోత్సవం పురస్కరించుకుని శని వారం జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా రన్తోపాటు ర్యాలీలు నిర్వ హించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ వీధుల్లో స్వచ్ఛత ర్యాలీలు చేపట్టారు. స్వ చ్ఛత ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిం చారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత మరుగుదొడ్డిని వినియోగించా లని వివరించారు. పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుం దని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత ఆరో గ్యశ్రద్ధ్ద వహించాలని, అప్పుడే ఆనారోగ్య సమస్యలకు దూరం గా ఉంటామని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు.
మెదక్ పట్టణంలో పారిశుధ్య కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలో ప్రధాన కూడళ్లలోని మరుగుదొడ్లను మున్సిపల్ కమిషనర్ జానకిరాం సాగర్, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్తో కలిసి పరిశీలించారు. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాలతో పాటు చేగుంట, తూప్రాన్ మండలాల్లోని వివిధ గ్రామాల్లో స్వచ్ఛతా ర్యాలీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని ఉపయోగించుకుని గ్రామాలను స్వచ్ఛతలో ఆద ర్శంగా నిలవాలని సర్పంచ్లు పిలుపపునిచ్చారు. ప్రతి కుటుంబం మరుగుదొడ్డి నిర్మించుకున్నంత మాత్రాన పారిశుద్ధ్య సమస్య తొలిగిపోదని, దానిని ఉపయోగించుకున్నప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందన్నారు. మనోహరాబాద్లో స్వచ్ఛతపై ప్రజలతో ప్రజాప్రతినిధులు ప్రతిజ్ఞ చేయించారు.
– మెదక్ జిల్లా నెట్వర్క్, నవంబర్ 19