మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పూర్తయిన భూముల సర్వే
తెలంగాణ ప్రభుత్వం పోడు భూముల హక్కు పత్రాలను అందజేసేందుకు చేస్తున్న సర్వే కొలిక్కి వచ్చింది. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో అధికారులు చేపట్టిన సర్వే వంద శాతం పూర్తి కావడంతో అర్హులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోడు సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారుల కమిటీ క్షేత్రస్థాయిలో సర్వేను పకడ్బందీగా నిర్వహించారు. సాగు రైతుల వివరాలను యాప్లో నమోదు చేస్తుండగా, గ్రామాల్లో గ్రామ సభలు కొనసాగుతున్నాయి. మెదక్ జిల్లాలోని 64 హ్యాబిటేషన్ల పరిధిలో 4028 దరఖాస్తులు రాగా, సంగారెడ్డి జిల్లాలో 3903 దరఖాస్తులు వచ్చినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి.
పోడు భూముల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పకడ్బందీగా
మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో భూముల సర్వే వందశాతం పూర్తయింది. గత నవంబర్లోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. మెదక్లో 62 పంచాయతీల్లో 6673 ఎకరాలున్నట్లు రైతులు తెలుపగా, సర్వేలో 1872 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 4028 మంది గిరిజన, గిరిజనేతరులు దరఖాస్తు చేసుకోవడంతో క్షేత్రస్థాయిలో అటవీ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పర్యటించి విచారణ పూర్తి చేశారు. సంగారెడ్డి జిల్లాలో 51 పంచాయతీల్లో 6648 ఎకరాలను సాగు చేస్తున్నామని రైతులు పేర్కొనగా, సర్వే అనంతరం 3451.11 ఎకరాలుగా తేలింది. 3903 మంది దరఖాస్తు చేసుకున్నారు. సర్వే వివరాలను ఎప్పటికప్పుడు సిబ్బంది ప్రత్యేక యాప్లో నమోదు చేశారు. ప్రస్తుతం గ్రామసభలు నిర్వహిస్తున్న యంత్రాంగం నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. దాని ఆధారంగా అర్హులకు భూమి హక్కు పత్రాలు అందించనున్నారు.
– మెదక్/ సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ), నవంబర్19
మెదక్/ సంగారెడ్డి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సర్వే వందశాతం పూర్తయింది. గిరిజన, గిరిజనేతర రైతులు ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న పోడు భూముల సర్వే ప్రక్రియ పూర్తవ్వడంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈమేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వేను పకడ్బందీగా నిర్వహించారు.
మెదక్ జిల్లాలో వంద శాతం సర్వే పూర్తి…
పోడు భూముల సర్వే మెదక్ జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో కలెక్టర్ హరీశ్తో పాటు ఇతర అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఉద్యోగులకు సూచనలు చేస్తుండడంతో వందశాతం పూర్తయింది. అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు సంయుక్తంగా చేపట్టి, వివరాలన్నింటినీ యాప్లో నమోదు చేశారు. జిల్లాలోని 62 గ్రామ పంచాయతీలకు సంబంధించి 64 హ్యాబిటేషన్లలో 6673 ఎకరాలకు గాను 4028 దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ జరిపారు. అయితే పోడు భూముల సర్వేలో జిల్లా వ్యాప్తంగా 1872 ఎకరాలు ఉన్నట్లు సర్వేలో తేలింది.
పోడు భూముల సర్వే వంద శాతం పూర్తి
జిల్లాలో దరఖాస్తు చేసుకున్న పోడు రైతుల సాగు భూములను వివిధ శాఖల అధికారులతో కూడిన సంయుక్త కమిటీ పర్యవేక్షణలో సర్వేను వందశాతం పూర్తి చేశాం. ప్రభుత్వ సూచనలతో మూడు రోజులుగా గ్రామసభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభల అనంతరం ఆర్డీవోకు, జిల్లా కమిటీకి నివేదిక అందుతుంది. జిల్లాలో 62 గ్రామ పంచాయతీల్లో 64 హ్యాబిటేషన్లలో 6673 ఎకరాలకు గాను 4028 దరఖాస్తులు వచ్చాయి. – హరీశ్, మెదక్ జిల్లా కలెక్టర్
సంగారెడ్డి జిల్లాలో సర్వేతో తేలిన పోడుభూమి విస్తీర్ణం
సంగారెడ్డి జిల్లాలోని 51 గ్రామాలకు చెందిన 3903 మంది రైతులు తాము 6648.97 ఎకరాల పోడుభూములను సాగు చేస్తున్నామని వాటి పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వేఆండ్ల్యాండ్ రికార్డ్సు, అటవీశాఖ సంయుక్త సర్వేలు నిర్వహించాయి. ఈ సర్వేలో దరఖాస్తు చేసుకున్న 3903 రైతులు తాము సాగు చేసుకుంటున్నభూముల కంటే అదనంగా సాగు చేసుకుంటున్నట్లు తేలింది. 3903 మంది రైతులు 6648.97 ఎకరాల్లో సాగు చేసుకుంటున్నట్లు చెప్పగా సర్వేలో 3903 మంది రైతులు 3451.11 ఎకరాల్లో పోడు భూములు సాగు చేసుకున్నట్లు తేలింది. ఆయా భూములపై హక్కు కల్పించేందుకు జిల్లాలోని 51 గ్రామాల్లో అధికారులు గ్రామసభలు నిర్వహిస్తున్నారు.
గ్రామ సభల ద్వారా నివేదిక…
మెదక్ జిల్లాలో పోడు భూముల సర్వే వంద శాతం పూర్తయింది. ఇప్పుడు గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 25వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి వాస్తవంగా సాగులో ఎవరు ఉన్నారో నివేదిక సిద్ధం చేస్తారు. ఈ నివేదికను గ్రామ సభల్లో ప్రవేశపెట్టి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఆ తర్వాత పూర్తిస్థాయిలో నివేదికను యంత్రాంగం ప్రభుత్వానికి అందించనున్నది. అప్పుడు అర్హులైన పోడు రైతులకు రాష్ట్ర హక్కు పత్రాలను జారీ చేస్తుంది.
గత నవంబర్లోనే దరఖాస్తుల స్వీకరణ..
పోడు సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నుంచి చర్యలు తీసుకుంటున్నది. అటవీ హక్కుల చట్టాన్ని అనుసరించి 2005 డిసెంబర్ 13కు పూర్వం మూడుతరాలుగా గిరిజన ప్రాంతంలో ఉంటూ అటవీ భూములు సాగు చేస్తున్న గిరిజనులు, ఇతర అటవీ నివాసితులకు హక్కుపత్రాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గత ఏడాది నవంబర్లో దరఖాస్తులను ఆహ్వానించింది. నవంబర్ 18 వరకు ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ) ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. ఆ తర్వాత పోడు భూముల సర్వే చేపట్టలేదు. దీంతో సీఎం కేసీఆర్ పోడు భూములకు సంబంధించిన క్షేత్రస్థాయిలో సర్వే జరపాలని ఆదేశించారు. దీంతో జిల్లాలో పోడు భూముల సర్వే నిర్వహించగా, వందశాతం పూర్తి చేశారు.