నాకు పెద్ద కొడుకు కేసీఆర్ ఉండగా నాకేం తిప్పలు బిడ్డ
నెలకు రెండు వేలు ఇస్తుంటే నేను బతుకనా
రామాయంపేటలో పండ్లు కొనుగోలు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
గోగుపూలను అందజేసిన సామాజిక సేవకుడు రామకిష్టయ్య
రామాయంపేట, మార్చి1: మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట మున్సిపల్లో శివరాత్రి సందర్భంగా పండ్లను కొనుగోలు చేశారు. మంగళవారం నిజాంపేట మం డలం నందిగామలో ప్రోగ్రాం ముగించుకుని తిరు గు ప్రయాణంలో రామాయంపేటలోని పండ్ల దుకాణాల వద్ద కిక్కిరిసినట్లు ప్రజలు కనబడటంతో తన వాహనాన్ని కొద్దిసేపు ఆపి పండ్ల దుకాణాదారులతో ముచ్చటించారు. ఓ వృద్ధురాలు గోగుపూలు అమ్ముతుండ టంతో అక్కడికి వెళ్లి వృద్ధురాలు క్షేమ సమాచారాలు అడిగి తెలసుకున్నారు. అవ్వ నీకు పింఛ న్ వస్తుందా అంటూ ఆరా తీశారు. దేవుడసొంటి కొడుకు కేసీఆర్ ఉండంగా బతకనా ఆ కొడుకు పు ణ్యాన్నే నెలకు రెండువేల పింఛన్ తో బతుకుతున్న అంటూ తెలిపింది. నేనెవరో తెలుసా అని ఎమ్మెల్యే చమత్కారంగా అడుగగా, నువ్వు పద్మక్కవు కాదా అంటూ వృద్ధురాలు సమాధానం ఇచ్చింది.
ఎమ్మెల్యేకు దండం పెట్టి కేసీఆర్ నువ్వు చల్లంగా బతుకుండ్రి బిడ్డ అంటూ దీవించింది. అనంతరం ఝాన్సీలింగాపూర్ మాజీ సర్పంచ్ రామాయంపేట బొక్కల వైద్యుడు మానెగల్ల రామకిష్టయ్య, ఎమ్మెల్యేకు గోగుపూలను అందజేశారు.