శివ్వంపేట, నవంబర్ 16 : గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని నిర్వాహకులకు అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. బుధవారం మండలంలోని చండి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఎం పీపీ కల్లూరి హరికృష్ణతో కలిసి పరిశీలించారు. రైతులు ధాన్యా న్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు. ధాన్యం ఆరబెడితే మంచి లాభాలు వస్తాయని, దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.
శివ్వంపేట మండలకేంద్రంలోని ఓం సాయి వెంకటరమణ రైస్మిల్ను అదనపు కలెక్టర్ సందర్శించారు. మిల్లులో ధాన్యం లోడింగ్, అన్లోడింగ్ వెనువెం టనే పూర్తి చేయాలని నిర్వాహకులకు, సిబ్బందికి సూచించా రు. ప్రభుత్వ ఆదేశాలను ప్రతి రైస్మిల్లు యజమాని పాటించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ వెంట టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమణాగౌడ్, పీఏసీఎస్ సీఈవో మధు, స్థానిక అధికారులు ఉన్నారు.
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం : పీఏసీఎస్ చైర్మన్
చిలిపిచెడ్, నవంబర్ 16 : పండిన ప్రతి ధాన్యం గింజనూ కొనుగోలు చేస్తామని సోమక్కపేట పీఎసీఎస్ చైర్మన్, వైస్ చైర్మన్, ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బుధవారం నర్సా పూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిని హైదరాబాద్లో కలిసి ధాన్యం కొనుగోళ్లపై చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
చిలిపిచెడ్ మండలంలో ధాన్యం తరలించాలని, లారీల సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ హరీశ్కు ఎమ్మెల్యే ఫోన్ చేసి కోరారు. నర్సాపూర్ మండలంలోని రైస్ మిల్లులకు చిలిపిచెడ్ మండలంలోని ధాన్యాన్ని తరలించాలని సూచించారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో పీఎసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అశోక్రెడ్డి, స ర్పంచ్లు గోపాల్రెడ్డి, పరశురాంరెడ్డి, భిక్షపతినాయక్, మాజీ సర్పంచ్ బెస్త లక్ష్మణ్, స్థానిక నేత మాణిక్యరెడ్డి ఉన్నారు.
కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి
నిజాంపేట, నవంబర్ 16 : ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని మండల ప్రత్యేకాధికారి నాగరాజు అన్నారు. ఎంపీడీవో వెంకటలక్ష్మితో కలిసి చల్మెడ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శిం చారు. రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, కొనుగోలు కేం ద్రానికి తేవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి రైతులు సహకరించాలని మండల ప్రత్యేకాధికారి కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ నర్సింహరెడ్డి ఉన్నారు.
కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఏడీఏ సురేఖ
మనోహరాబాద్, నవంబర్ 16 : రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటించి వడ్లను కొనుగోలు కేంద్రాలకు తేవాలని నర్సాపూర్ ఏడీఏ సురేఖ అన్నారు. మనోహరాబాద్లోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…రైతులు ఆధార్కార్డు, పట్టాపాస్బుక్, బ్యాంకుఖాతా వివరాలను కొనుగోలు కేంద్రం నిర్వాహకుల కు అందజేసి, రసీదు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో రాజశేఖర్, ఏఈవో నరేందర్గౌడ్ ఉన్నారు.
కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపాలి
టేక్మాల్, నవంబర్ 16 : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని తూకం వేసి, రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని తరలించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐకేపీ కేంద్రాలకు సరియైన సమయానికి లారీలు పంపాలని రైతులు రాస్తారోకో చేపట్టారు. కాదులూర్ గ్రామానికి చెందిన రైతులు మెదక్-బొడ్మట్పల్లి రహదారిపై రాస్తారోకో చేపట్టి, నిరసన తెలిపారు. లారీలు రాకపోవడంతో కొనుగోళ్లు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోతున్నారు. రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న తహసీల్దార్ సర్దార్ హర్దిప్సింగ్, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి, రైతులతో మాట్లాడారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లో ధాన్యాన్ని తరలించడానికి లారీలను పం పిస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.