రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి
శివ్వంపేట, మార్చి 1 : జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా చిన్నతనం నుంచే సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మంగళవారం శివ్వంపేటలో సర్పంచ్ శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో జడ్పీటీసీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐదుగురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు సునీతాలక్ష్మారెడ్డి చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మండల ప్రజలకు ఆపద వస్తే నేనున్నానంటూ మహేశ్ వెంటనే స్పందించి ఆదుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జడ్పీటీసీ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మండలంలోని దొంతి బేతని సంరక్షణాలయంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి రూ.21 వేలను ఆశ్రమానికి అందజేశారు. శివ్వంపేటలోని 6వ వార్డులో తన సొంత ఖర్చులతో మంచినీటి బోరు వేయించారు.
జడ్పీటీసీ సేవలను స్ఫూర్తిగా తీసుకొని..
గోమారం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 11 మంది విద్యార్థినులకు అదే గ్రామానికి చెందిన ప్రణీత్రెడ్డి సొంత డబ్బులతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి చేతుల మీదుగా నోట్ బుక్స్ అందజేశారు. అదేవిధంగా నవాబ్పేట గ్రామానికి చెందిన వార్డుమెంబర్ ఇంద్రేశ్ సొంత ఖర్చులతో కుట్టుమిషన్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రాగౌడ్, నర్సాపూర్ మున్సిపాల్ చైర్మన్ మురళీయాదవ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటరాంరెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్ మన్సూర్, ప్రజాప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు.