చేగుంట/తూప్రాన్/నర్సాపూర్/ పెద్దశంకరంపేట/మనోహరాబాద్/చిన్నశంకరంపేట /వెల్దుర్తి/మెదక్ అర్బన్/మెదక్రూరల్, ఫిబ్రవరి28 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లాలో అన్ని శైవక్షేత్రాలు, శివాలయాలు ముస్తాబయ్యాయి. మెదక్ మండల పరిధిలోని మంబోజిపల్లి శివారులోని కోయ్యగుట్టపై కొలువుదీరిన మల్లికార్జున స్వామి ఆలయం, ఖాజీపల్లి కాల భైరవస్వామి ఆలయం, రాజ్పల్లి శివాలయం, పేరురూ గరుడాగంగ సరస్వతీ ఆలయం ముస్తాబయ్యాయి. మెద క్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధిలోని ప్రాచీన శివాలయం, నటరాజా శివాలయం, కుమ్మరిగడ్డ వీధిలోని శివాలయం, మార్కెట్ వీధిలోని శివాలయం , ఔరంగాబాద్లోని రాజరాజేశ్వర ఆలయం, ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయాలు విద్యుత్ దీపాలతో అలం కరించారు. హవేళీఘనపూర్ మండలం ముత్తాయికోట లోని ప్రసిద్ధ్దిగాంచిన సిద్ధ్దిరామేశ్వర ఆలయం అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ దేవాలయంలో శివరాత్రి వేడుకలు నాలుగు రోజుల పాటు ఘనంగా నిర్వ హించనున్నారు.
వెల్దుర్తిలో..
తెలంగాణ కాశీ క్షేత్రంగా పేరుగాంచిన వెల్ధుర్తి మండలంలోని బస్వాపూర్ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం (మల్లన్నగుట్ట) మహా శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు.
నేటి నుంచి సంగమేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవాలు
చిన్నశంకరంపేట మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయ 73వ వార్షికోత్సవాలు నిర్వహించేందుకు ఆలయాన్ని సర్వాంగ సుందరంగాముస్తాబు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలని సర్పం చ్ లక్ష్మణ్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు.
నేటి నుంచి పలు గ్రామాల్లో జాతర
మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం నుంచి జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. చెట్లగౌరారంలోని శల్మనాయగుట్టలపై మంగళవారం ప్రత్యేక పూజలు జాతర, అన్నదానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీహరిగౌడ్ తెలిపారు.లింగారెడ్డిపేటలో శ్రీరాజరాజేశ్వరిసమేతరామలింగేశ్వరస్వామి గుట్ట వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు పెం టాగౌడ్ తెలిపారు.
పెద్దశంకరంపేటలో..
పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శివాలయాలు ప్రత్యేక పూజలకు ముస్తాబయ్యాయి. దక్షిణకాశీగా పేరుగాంచిన శ్రీకొప్పోల్ ఉమా సంగమేశ్వర దేవాలయంతో పాటు గొట్టి ముక్కుల రాజుల గుట్టపై వెలసిన శివాలయం, పెద్దశంకరంపేటలోని శివాలయం, విఠలేశ్వర మందిరాలతో పాటు గురుపాద గుట్ట శివాలయం, మండలపరిధిలోని టెంకటి గ్రామంలోని కాశీ విశ్వేశ్వరాలయం శివరాత్రికి ముస్తాబయ్యాయి. తూప్రాన్ పట్టణంలోని ప్రధాన రహదారిపై గల శివాలయానికి రంగులద్ది, విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ధర్మకర బజారు చక్రవర్తి తెలిపారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో సోమవారం నుంచే పండ్ల విక్రయాలు ఊపందుకున్నాయి.