ఝరాసంగం, అక్టోబర్23: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన కేతకీ సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవు కావడంతో స్వామిని దర్శించుకునేందుకు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్ట నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివ నామస్మరణతో మార్మోగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాక ప్రారంభమైంది.
భక్తులు అమృత గుండంలో పుణ్యస్నానాలు చేసి గర్భ గుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు సమర్పించుకున్నారు. భక్తులకు అర్చకులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.