మునిపల్లి, అక్టోబర్ 23: సర్కార్ దవాఖాన అంటేనే చిన్నచూపు.. ఎర్రగోలి.. పచ్చగోలి తప్ప ఏమీ ఉండవని, వైద్యులు అసలే రారని, నేను రాను బిడ్డో సర్కార్ దవా ఖాన అనే రోజులకు కాలం చెల్లింది. స్వరాష్ట్రంలో పరిస్థి తులు మారాయి. 24గంటల సేవలు అందుబాటులో ఉన్నాయి. సర్కార్ దవాఖానలో సాధారణ కాన్పుల సం ఖ్య పెరిగింది. సురక్షితంగా కాన్పు చేసి, కేసీఆర్ కిట్ అం దజేసి తల్లీబిడ్డను క్షేమంగా ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దింపుతున్నారు.
ఒకప్పుడు ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు అంటే భయ పడే పరిస్థితి ఉండేది. ప్రభుత్వ దవాఖానలకు రావా లంటేనే గర్భిణులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్లేవారు. తెలంగాణ రాక ముందు ప్రభుత్వ దవాఖానకు గర్భిణి ప్రసూతి కోసం వెళ్తే తల్లీబిడ్డ క్షేమంగా తిరిగివస్తారనే నమ్మకం లేకుండేది. తప్పని పరిస్థితుల్లో ప్రైవేట్ దవాఖానకు వెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లాలంటే భరించలేని అర్థిక భారం ఉండేది. అంతేకాకుండా కడుపులో బిడ్డ అడ్డం తిరిగిం దని, ఆలస్యం చేస్తే తల్లీబిడ్డ ప్రాణాలకు ముప్పు అని అవ సరం లేకున్నా సిజేరియన్లు చేసి డబ్బులు గుంజిన సంద ర్భాలున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్తే సాధారణ కాన్పు అన్న మాట ఉండేది కాదు. ఇప్పుడు ప్రభుత్వ దవాఖా నల్లో సాధారణ కాన్పులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానాలకు ప్రజల తాకిడి ఎక్కువైంది. కా ర్పొరేట్ దవాఖానలకు దీటుగా ప్రభుత్వ దవాఖానాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి.
కేసీఆర్ కిట్ పథకంతో మహిళలు సంతోషం వ్యక్తం చేస్తు న్నారు. ప్రభుత్వ దవాఖానలో ప్రసవం పొందిన వారి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం చాలామందికి ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు బిడ్డ పుట్టిన తర్వాత కావాల్సిన పోషకాహారం, తల్లీ బిడ్డకు కావాల్సిన ఇతర సౌకర్యాలు అందిస్తుండటంతో సంబురపడుతున్నారు. ఈ పథకం ప్రయోజనకరంగా ఉండటంతో గర్భిణులు ప్రభు త్వ దవాఖానలకు ఆకర్శితులవుతున్నారు.
ఈ పథకంతో గర్భిణికి రూ.12వేల ఆర్థిక చేయూత, ఆడబిడ్డ పుడితే మరో రూ. వెయ్యి అందజేస్తున్నారు. అంతేకాకుండా కిట్లో బేబీ అయిల్, బేబీ సోప్, దోమతెర, డ్రస్సులు, హ్యాండ్ బ్యాగులు, పుట్టిన బిడ్డ ఆడుకునేందుకు బొమ్మలు, డైపర్స్, పౌడర్, షాంపూ, చీరలు, టవల్స్, న్యాప్కిన్స్ బేబీ బెడ్ అందిస్తున్నారు. ప్రైవేట్ దవాఖానకు వెళ్తే అడిగినంత ఫీజులు చెల్లించడంతో పాటు సిజేరియన్ పేరిట కోత బాధ భరిస్తూ, డెలివరీ తర్వాత బాలింతకు, పుట్టినబిడ్డకు అవ సరమైన వస్తువులు కొనడానికి చాలా ఖర్చు తప్పింది.
సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానాల్లో ఎలాంటి ఖర్చు లేకుండా సాధారణ ప్రసవం అయ్యే అవకాశం కల్పించ ప్రజలు కేసీఆర్కు జైజైలు పలుకుతున్నారు.ప్రభు త్వ దవాఖానలో తప్పని పరిస్థితుల్లో ఆపరేషన్ చేసినా నయా పైసా చెల్లించాల్సిన అవసరం లేదు. అదనంగా ఆర్థిక చేయుతతో పాటు 16రకాల వస్తువులు కేసీఆర్ కిట్ ద్వారా అందిస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల కోసం మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ దవాఖానల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసు కుం టున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో సా ధారణ కాన్పులకు ప్రాధా న్యం ఇస్తున్నాం. మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సాధారణ కాన్పులు అ ధికంగా చేస్తున్నాం. కేసీఆర్ కిట్ పథకంతో సర్కారు ద వాఖానల్లో ప్రసూతికి వచ్చే వారి సంఖ్య పెరిగింది. ప్రభుత్వ దవాఖానకు వచ్చిన వారు వైద్య సేవలు బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. 24 గంటలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నాం.
– డాక్టర్ శిరీష మునిపల్లి-ప్రాథమిక ఆరోగ్య కేంద్రం