మెదక్ అర్బన్,అక్టోబర్23: ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఆర్టీసీ చైర్మన్గా బాజీరెడ్డి గోవర్దన్రెడ్డి, ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ నష్టాల బాట నుంచి లాభాల బాటలో పయనిస్తున్నది. ప్రతి ఆర్టీసీ ఉద్యోగి సంస్థ కోసం అహర్నిశలు కష్టపడడంతో సంస్థ కొంతమేరకు లాభాల బాట పట్టింది. దీపావళి సందర్భంగా ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్తో పాటు 2019లోని రెండు డీఎలను రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాలో జమ చేయనున్నారు.
మెదక్ ఆర్టీసీ డిపోలో మొత్తం 370 మంది, నర్సాపూర్ డిపోలో 80 మంది ఆర్టీసీ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ సంస్థ దీపావళి కానుకగా ప్రతి ఉద్యోగికి అడ్వాన్స్ అందజేస్తున్నది. దీంతో పాటు 2019కి సంబంధించిన రెండు డీఏలను సైతం ఉద్యోగుల ఖాతాలో జమచేయనున్నది. ఒక్కో ఉద్యోగికి నెలకు రూ.4500 నుంచి 5000 వరకు, ఒక సంవత్సరానికి రూ.60,000 వరకు గరిష్టంగా వారి ఖాతాల్లో ప్రభుత్వం అదనంగా జమ చేయనున్నది.
ఆర్టీసీ ఉద్యోగులకు దీపావళి కానుకగా అడ్వాన్స్తో పా టు 2019 డీఏలు అందజేయడం ఆనందంగా ఉంది. ఆర్టీసీ సంస్థ తమ ఉద్యోగులకు దీపావళి పండుగ కానుకగా ఇవ్వడంతో మా కుటుంబాల్లో నిజమైన దీపావళి పండుగ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.