మెదక్, ఫిబ్రవరి 21 : నారాయణఖేడ్లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు సోమవారం సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న సందర్భంగా మెదక్ జిల్లాలోని మెద క్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి బస్సుల్లో, కార్లల్లో భా రీ సంఖ్యలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు. మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల నుంచి 200 బస్సులు, 500 కార్లల్లో సుమారు 15వేల మంది సీఎం బహిరంగ సభకు బయలుదేరి వెళ్లారు. మెదక్ నియోజకవర్గం నుంచి 100 బస్సులు, 200 కార్లలో కాన్వాయ్గా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి సీఎం సభకు వెళ్లారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బస్సులు, కార్లలో టీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి బయలుదేరారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెదక్ నియోజకవర్గంలోని మెదక్, హవేళీఘనపూర్, చిన్నశంకరంపేట, రామాయంపేట, నిజాంపేట, పాపన్నపేట మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, పార్టీ శ్రేణులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామాయంపేట, నిజాంపేట, మనోహరాబాద్ నుంచి
రామాయంపేట మండలం నుంచి టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు బండారి మహేందర్రెడ్డి అధ్వర్యంలో సీఎం సభ కు భారీగా తరళివెళ్లారు. మార్గ మధ్యంలోనే మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిని కలిశారు. సభకు తరలివెళ్లిన వారిలో రామయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, కౌన్సిలర్ దేమె యాదగిరి, సర్పంచ్లు మైలారం శ్యాములు, నర్సాగౌడ్, సురేశ్, టీఆర్ఎస్ నాయకులు భిక్షపతి, మెట్టు యాదగిరి, కర్రె రమేశ్, శ్రీధర్రెడ్డి, దేవేందర్ ఉన్నారు. మనోహరాబాద్ మండలం నుంచి పీఏసీఎస్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు భగవాన్రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీహరి తరలివెళ్లారు.నిజాంపేట మండ లంలోని వివిధ గ్రామాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో సీఎం సభకు టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.
నర్సాపూర్ నుంచి
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గ్రామాల నుంచి టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. నర్సాపూర్లో ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు తరలివెళ్లారు. సభకు తరలిన వారిలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అశోక్గౌడ్, శ్రీధర్ గుప్తా, ఆత్మకమిటీ చైర్మన్ శివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఉన్నారు.