సంగారెడ్డి/మెదక్ న్యూస్నెట్వర్క్, సెప్టెంబర్ 21;శాంతి భ్రదతల పరిరక్షణ, మెరుగైన సమాజం కోసం ఎందరో పోలీసులు తమ ప్రాణాలు అర్పించారని, వారి త్యాగాలు మరువలేనివని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్, మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు.శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా జిల్లా కేంద్రాల్లో అమరవీరుల స్తూపాలకు నివాళులర్పించి, మౌనం పాటించారు. అమరుల కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.బాధిత కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పలుచోట్ల పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీలు, రక్తదాన శిబిరాలు, పోటీలు నిర్వహించారు.
సమాజంలో అల్లర్లు, సంఘవిద్రో హ చర్యలకు పాల్పడే వారి నుంచి ప్రజలను రక్షించేందుకు రక్షకభటులు ప్రాణాలు అర్పిస్తున్నారని, అమరుల త్యాగాలను స్మరించుకోవడం మన కర్తవ్యమని సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ అన్నారు. శుక్రవారం పరేడ్ మైదానంలో అమరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు పెట్టి నివాళులర్పించారు. పరేడ్ కమాం డర్ ఆధ్వర్యంలో స్మృతి పరేడ్ నిర్వహించి రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు. అనంతరం అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజ శాంతిని కాపాడే ప్రక్రియలో దేశవ్యాప్తంగా విధు లు నిర్వహిస్తూ, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, సంఘవిద్రోహ శక్తుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవానుల త్యాగాలను గుర్తు చేసుకుని నివాళులర్పించాలన్నారు. అమరుల ఆత్మశాంతి కోసం పోలీసు యంత్రాంగం ప్రతి ఏడాది అమరులవీరుల సంస్మరణ దినం జరుపుకొని నివాళులర్పించడం సాంప్రదాయమన్నారు.
రాష్ట్రంలో నక్సలిజం తీవ్ర ప్రభావం
దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన సమస్య ఉండేద ని, మన రాష్ట్రంలో నక్సలిజం తీవ్ర ప్రభావం ఉండేదని, ఆ సమయంలో ఎంతోమంది జవాన్లు కోల్పోవడం జరిగిందని గుర్తు చేశారు. మహారాష్ట్ర, ఛతీస్గఢ్, అస్సాం రాష్ర్టాల్లో వీర జవాన్లను దేశం కోల్పోయిందన్నారు. దేశ సరిహద్దులోని జమ్ముకశ్మీర్ లాంటి రాష్ర్టాల్లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో ఆర్మీ జవాన్లు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. జిల్లా విధి నిర్వహణలో ప్రాణాలర్పిం చి వీరమరణం పొందిన త్యాగమూర్తుల కుటుంబాలను కలిశామన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను ఓదార్చుతూ వారిలో మనధైర్యాన్ని అందించడమే పోలీసు అమరవీరులకు మనం అందించే నిజమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు రవీంద్రారెడ్డి, రఘు, ఎస్బీ ఇన్స్పెక్టర్ మహేశ్గౌడ్, ఉమెన్ పీఎస్ ఇన్స్పెక్టర్ హేమరాణి, ఆర్ఐలు కృష్ణ, డానియల్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దుర్గారెడ్డి, అమరుల కుటుంబసభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
అమరుల స్తూపానికి పుష్పగుచ్చాలతో నివాళులు
మెదక్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ) : పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా మెదక్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో ఎస్పీ రోహిణిప్రియదర్శిని ఆధ్వర్యంలో పోలీసు అధికారులు అమరవీరుల స్తూపం వద్ద పుష్పాగుచ్ఛం పెట్టి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ గతేడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో విధి నిర్వహణలో మరణించిన 264 మంది పోలీస్ అమరవీరులు, మెదక్ జిల్లాకు చెందిన 14మంది అమ రు వీరుల త్యాగాలను గుర్తు చేశారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని మాట్లాడుతూ ప్రజల సేవకోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహానుభావులని, పోలీసు అమరవీరుల చూపి న మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలని తెలిపారు.
ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పని చేయాల్సి వుంటుందని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సంఘ విద్రోహ శక్తుల ఆగడాలపై నిరంతరం అలుపెరగని పోరాటం చేస్తూ శాంతిభద్రతలను కాపాడుతూ సమాజ శ్రేయస్సు కోసం పరితపించే వారే పోలీసులు అని పేర్కొన్నారు. అమరుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారు మన మధ్య లేకున్నా మనం వారిని స్మరిస్తూనే ఉండాల న్నారు. అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై వుందని, వారికి ఎలాంటి సమస్య ఉన్నా పోలీస్ విభాగం తరుపున పూర్తి సహకారం అందజేస్తామన్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 14మంది అమరవీరుల కుటుంబాలను ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ పరామర్శించి పోలీసు వ్యవస్థ తరపున అన్ని వేళల్లో ఆదుకుంటామని భరోసా కల్పించారు. అనంతరం అమరుల కుటుంబాలకు జిల్లా పోలీసు శాఖ తరపున జ్ఞాపికలను అందజేశారు.
అమరవీరుల సంస్మరణ దినం (పోలీసు ఫ్లాగ్ డే) సందర్భంగా మెదక్ డీఎస్పీ సైదులు, మెదక్ పట్టణ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ విజయ్, జిల్లా పోలీస్ సిబ్బంది, యువకులు 60 యూనిట్ల రక్త దానం చేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. బాలస్వామి, మెదక్ డిఎస్పీ సైదులు, తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ సీఐ నవీన్బాబు, మెదక్ పట్టణ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ విజయ్, అల్లాదుర్గ్ సీఐ జార్జ్, ఆర్ఐ నాగేశ్వర్రావు, ఐటీ కోర్ ఎస్ఐ సందీప్రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.