నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 18: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) దేశంలో ప్రత్యామ్నాయశక్తిగా ఎదగడం ఖాయమని, రానున్న రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటా యని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సాధించారని, సాధించిన రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని పేర్కొంటున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్పార్టీలకు నూకలు చెల్లాయని, దేశాన్ని అభివృద్ధి చేసే శక్తి సామర్థ్యాలు సీఎం కేసీఆర్కు ఉన్నాయని నిపుణులు, మేధావులు అంగీకరిస్తున్నారు. తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని, రానున్న రోజుల్లో దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించడం ఖాయమంటున్నారు.
బీఆర్ఎస్పార్టీకి దేశ ప్రజలు మద్దతు
సీఎం కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్కు దేశ ప్రజలంతా మద్దతు తెలుపుతున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు నూకలు చెల్లాయి. ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ దేశ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం ఖాయం. సీఎం కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. సీఎం కేసీఆర్తోనే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగడం తథ్యం.
– వజ్రోజు శంకరాచారి, విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర కార్యదర్శి, కమలాయపల్లి (మద్దూరు)
బీఆర్ఎస్తో అన్నివర్గాలకు న్యాయం
బీఆర్ఎస్తో అన్నివర్గాలకు న్యాయం జరగడం ఖాయం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు నాయకత్వంలో అటు తెలంగాణ, ఇటు సిద్దిపేట జిల్లాలోని ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలో ముందు వరుసలో ఉంది. తెలంగాణలో ఏ ప్రాంతం చూసినా కరువు అనేది కనిపించకుండా కాళేశ్వరం జలాలు ప్రతి గ్రామానికి చేరాయి. పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, యువకులకు ఉపాధి కల్పనలో తెలంగాణ ప్రభుత్వం పనితీరు బాగుంది. ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికీ చేరుతున్నాయి.
– శ్రీదేవీచందర్రావు,మండల పరిషత్ అధ్యక్షురాలు, సిద్దిపేట రూరల్ మండలం
కేసీఆర్ దేశానికి అవసరం
బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశానికి అవసరం. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు రైతులకు, సామాన్యులకు అందాలి. కేసీఆర్ చేస్తున్న మంచి పనికి మనమంతా సంపూర్ణ మద్దతు తెలుపాలి. సీఎం కేసీఆర్కు వెన్నంటి ఉండి ప్రజలంతా సహకారం అందించాలి. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలంతా గమనిస్తున్నారు. ఇదే తరహాలో దేశంలో కూడా పనులు కావాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారు.
– రమేశ్, సర్పంచ్, రాఘవాపూర్, సిద్దిపేటరూరల్ మండలం
సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచి
తెలంగాణ అభివృద్ధితో సీఎం కేసీఆర్ దేశానికి దిక్సూచిగా మారారు. ఆయన హయాంలో ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు ఎంతో అద్భుతం. దేశంలోని మేధావులంతా ఆయన్ను అభినందిస్తున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరమని కొనియాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేశానికి రైతే రాజు అన్న నానుడికి కేసీఆర్ తెలంగాణను నిదర్శనంగా చూపిస్తున్నారు. రైతు పథకాలను అమలు చేయాలని దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజలు ఒత్తిడి తెస్తున్నారు. అన్ని రాష్ర్ర్టాలకు సీఎం కేసీఆర్ రోల్ మాడల్గా మారారు.
– దాస్ యాదవ్, అమీన్పూర్
దేశంలో కొత్త ఒరవడి
తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారు. దేశంలో కొత్త ఒరవడి రావాలంటే ఆయనతోనే సాధ్యం. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజలు, రైతులకు ఏం చేసింది?. కార్పొరేట్ సంస్థలకు వంత పాడడమే తప్ప, సాధారణ ప్రజానీకం కోసం ఒక్క మంచి పని చేసింది లేదు. కులం, మతం అంటూ విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుతూ మోసం చేసే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాన మంత్రి కావాలి. అప్పుడు దేశంలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారు.
– కిష్టారెడ్డి, సర్పంచుల ఫోరం ఉమ్మడి పుల్కల్ మండల అధ్యక్షుడు
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సక్సెస్
బీఆర్ఎస్తోనే దేశాభివృద్ధి సాధ్యం. తెలంగాణ పథకాలను దేశంలోని ఇతర రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారు. రైతు బంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు సక్సెస్ అయ్యాయి. ఇలాంటి వాటిని దేశంలో అమలు చేయాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని అయితేనే సాధ్యం. బీఆర్ఎస్కు ప్రజలంతా అండగా ఉండాలి. సీఎం కేసీఆర్ ఏది చేసినా సక్సెస్ అవుతారు. రాజకీయాల్లో సీఎం కేసీఆర్కు తిరుగులేదు.
– పల్లె నరేశ్గౌడ్, సర్పంచ్, పుల్లూరు, సిద్దిపేటరూరల్ మండలం
దేశంలో సీఎం కేసీఆర్తో మార్పు తథ్యం
అందరినీ కలుపుకొని తెలంగాణ సాధించేదాకా పోరాటం చేసిన సీఎం కేసీఆర్ అదే పంథాలో బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశంలో కూడా మార్పు తీసుకురావడం తథ్యం. విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలతో తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి అన్నదాతకు సీఎం కేసీఆర్ కొండంత భరోసా ఇచ్చారు. ఉచిత విద్యుత్, సాగు,తాగునీరు, పంటలకు మద్దతు ధర, రైతు బంధు, రైతు బీమా పథకాలు తీసుకొచ్చి రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషిచేస్తున్నారు. జాతీయ పార్టీ బీఆర్ఎస్తో దేశ రాజాకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తారు.
– వి.చంద్రారెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్, బొల్లారం
సీఎం కేసీఆర్ రాజకీయనీతిజ్ఞుడు
దేశరాజకీయాల్లో కీలకపాత్ర పోషించడానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం అభినందనీయం. దేశంలో రాజకీయ ప్రతిభావంతుడు సీఎం కేసీఆర్ సార్.. దేశాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయగల విజ్ఞానవంతుడు. దేశంలో రాజకీయం భ్రష్టుపట్టిపోతున్నది. స్వార్థరాజకీయాలు పెరిగాయి. ప్రజల గురించి పట్టించుకునే నాయకుడు కనిపిస్తలేడు. దక్షిణభారత దేశం నుంచి సమర్థవంతుడు, దేశరాజకీయాలు తెలిసిన మహానేత సీఎం కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు. బీఆర్ఎస్తో దేశంలో కొత్త శకం ఆరంభమైంది. ఈ పరిణామాన్ని అందరూ స్వాగతిస్తున్నారు.
-ఎం.నరేందర్రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా యువనేత, గుమ్మడిదల మండలం