కౌడిపల్లి/ నర్సాపూర్/ శివ్వంపేట/ నిజాంపేట/ చేగుంట, అక్టోబర్ 13 : కౌడిపల్లి మండల కేంద్రానికి చెందిన రామకృష్ణా గౌడ్ బుధవారం కరెంట్ షాక్తో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి గురువారం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రామకృష్ణాగౌడ్ పార్థ్థివదేహానికి పూలమాలవేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ వెంకటేశ్వర్రెడ్డి, కృష్ణాగౌడ్, శ్రీనివాస్గౌడ్, రామాగౌడ్ ఉన్నారు.
నర్సాపూర్ మండలపరిధిలోని తుజాల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఆంజనేయులు సతీమణి ఇటీవల అనారోగ్యంతో మృ తి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్లో ఆంజనేయులు ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, మనోధైర్యం కల్పించారు. ఎమ్మెల్యే వెంట తుజాల్పూర్ సర్పంచ్ శ్రీరాములు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మన్సూర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) రాష్ట్ర నాయకుడు అశోక్గౌడ్, మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు అక్బర్, అస్లాం తదితరులు ఉన్నారు.
శివ్వంపేట మండలంలోని బాధిత కుటుంబాలను జడ్పీటీసీ పబ్బ మహేశ్గుప్తా పరామర్శించారు. భీమ్లాతండాకు చెం దిన గుగ్లోత్ లక్ష్మణ్, శంకర్తండాకు చెందిన మాలోత్ జెమిని ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను జడ్పీటీసీ పరామర్శించి రూ.5వేల చొప్పున ఆర్థికసాయంతోపాటు నిత్యావసర సరుకులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు చెన్నానాయక్, బాబూరావు, ఉపసర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు నవీన్, నాయకులు విఠల్, భిక్షపతిగౌడ్, భాస్కర్, నజీర్ తదితరులు ఉన్నారు.
నిజాంపేట మండలకేంద్రానికి చెందిన కొమ్మాట లక్ష్మణ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పంజా విజయ్కుమార్ తన సన్నిహితులతో బాధిత కుటుంబానికి రూ.5వేల నగదుతోపాటు 75 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాబు, నాయకులు జాలపోచయ్య, సిద్ధిరాంరెడ్డి, స్వామి ఉన్నారు.
చేగుంట మండలంలోని కొండపూర్(బీ) గ్రామానికి చెంది న తలారి మల్లేశం ఇటీవల మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యులను టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు రంగయ్యగారి రాజిరెడ్డి పరామర్శించి రూ.5వేల ఆర్థికసాయం అందజేశారు.