పుల్కల్, అక్టోబర్ 13 : రెండు రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 ఉండగా ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం 29.857 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నాటి వరకు 11వ గేటు ద్వారా నీటిని వదలగా గురువారం ఆ గేటును మూసి వేయగా ప్రాజెక్టులోకి 6000 క్యూ సెక్కులు వరద రూపంలో వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు స్పిల్ వే గేటు ద్వారా 8211 క్యూ సెక్కులు, జల విద్యుత్ 2647 క్యూ సెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తం 108 58 క్యూసెక్కులు నీటిని బయటకు వదులుతున్నట్లు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు పరీవాహక ప్రాంతాల ప్రజలు, మత్స్యకారులు, గొర్ల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా ప్రాజెక్టు సమీపాని కి వెళ్లొద్దని నీటి పారుదల అధికారులు హెచ్చరించారు.