సంగారెడ్డి, అక్టోబర్ 2: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన నుంచి నేటి వరకు అభివృద్ధ్దికి నిధులు మంజూరు చేసి రోడ్లు, సీసీ డ్రైన్స్లు, అవసరమున్న కాలనీల్లో పనులు చేస్తున్నామని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం పట్టణంలోని 37వ వార్డు కౌన్సిలర్ పద్మ ఆధ్వర్యంలో 14వ ఆర్థిక సంఘం, జనరల్ ఫండ్ల నుంచి రూ.16.50 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులను మున్సిపల్ చైర్పర్సన్తో కలిసి చింతా ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని అన్నారు. సీఎం కేసీఆర్ నారాయణఖేడ్కు వచ్చిన సందర్భంలో జిల్లా కేంద్రం సంగారెడ్డికి రూ.50 కోట్లు, సదాశివపేటకు రూ.25కోట్ల నిధులు ప్రకటించిన విషయం తెలిసిందేనన్నారు. టీఐఎఫ్ఐసీతో రెండు మున్సిపాలిటీలకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు ఇచ్చారని, ఈ నిధులకు సంబంధించిన పనులకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేశామన్నారు. కొన్ని పనులకు టెండర్లు పూర్తయ్యాయని, పనులను ప్రారంభించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నరహరి రెడ్డి, జడ్పీ కో-ఆప్షన్ ముస్తాఫా, పట్టణాధ్యక్ష, కార్యదర్శులు ఆర్. వెంకటేశ్వర్లు, పెరుమాండ్ల నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా, కౌన్సిలర్లు రామప్ప, విష్ణువర్ధ్దన్, శ్రీకాంత్(నాని), మార్కెట్ కమిటీ డైరెక్టర్ మసూద్, నాయకులు మనోహర్గౌడ్, రాంరెడ్డి, అమీర్ బేగ్, జలేందర్రావు, ప్రభాకర్ చౌదరి, వాజిద్, ఆజీమ్, రమేశ్ ఠాగూర్, సందీప్ ,చిన్ని వార్డు ప్రజలు పాల్గొన్నారు.