మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 30 : మెదక్కు బైపాస్ రోడ్డు నిర్మించేలా కృషి చేస్తానని, ఎంసీహెచ్ దవాఖాన వద్ద రెండెకరాల్లో పార్కును ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెండు నెలల్లో పిల్లికోటల్లో మరో 400 డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు పంపిణీ చేస్తామన్నారు. దశాబ్దాల రైల్వేలైన్ కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారన్నారు. వర్షాకాలంలో రోడ్లపైకి నీరు రాకుండా ఉండేలా సీసీ రోడ్లు నిర్మించి ఇరువైపులా డ్రైనేజీలు నిర్మించాలని డీఈ మహేశ్కు ఆదేశించారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పట్టణంలో లే అవుట్లకు అనుమతుల ఇవ్వాలని కమిషనర్ శ్రీహరికి సూచించారు.
మెదక్లో జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు అవసరమున్నదని, తప్పకుండా బైపాస్ రోడ్డు కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మామిళ్ల అంజనేయులు పట్టణానికి బైపాస్ రోడ్డు ఆవసరముందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. తప్పకుండా బైపాస్ రోడ్డు కృషి చేస్తానని, మెదక్ నుంచి బైంసా వరకు జాతీయ రహదారి మంజూరైన విషయం తెలిసిందే, ఈ రహాదారి మెదక్ పట్టణంలో నుంచి కాకుండా ర్యాలమడుగు నుంచి హవేళీఘనపూర్ వరకు విస్తరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. పట్టణంలో గ్రీన్ ఇండస్ట్రీయల్, ఇండస్ట్రీయల్ జోన్ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడంలేదని, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇండస్ట్రీయల్ జోన్లను ఎత్తివేయాలని ప్రజాప్రతినిధులు కోరారు.
పట్టణంలోని మినీ ట్యాంక్బండ్ పనులు పూర్తి చేయాలని, చిల్డ్రన్ పార్క్లో నర్సరీ ఏర్పాటు చేయడంతో పట్టణానికి పార్కు లేకుండా పోయిందని ఫిర్యాదు చేశారు. మినీ ట్యాంక్బండ్కు మరో రూ.3కోట్లు మంజురయ్యాయని, వాటి తో పూర్తవుతాయని ఎమ్మెల్యే సమాధానం ఇచ్చారు. ఎంసీహెచ్ దవాఖానా వద్ద రెండు ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో 600 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే మెదక్ రైల్వే లైన్ వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లతో భూసేకరణ పూర్తి చేసి రైల్వే డిపార్ట్మెంట్కు అప్పజెప్పడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా గా రూ.102 కోట్లు ఇవ్వడమే కాకుండా 10 ఏండ్లపాటు నష్టం జరిగినా భరిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.
మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ను కలిసి జిల్లా కేంద్రానికి ప్రత్యేక నిధులు తేవడానికి కృషి చేస్తానన్నారు. రెండు నెలల్లో పిల్లికోటాల్లో మరో 400 డబుల్ బెడ్రూమ్లను నిరుపేదలకు పంపిణీ చేస్తామన్నారు. ఆవారిబస్తీ, నర్సుఖేడ్లలో సీసీ రోడ్డు పనులు కాంట్రాక్టర్ ప్రారంభించడం లేదని కౌన్సిలర్లు ప్రస్తవించారు. పనులు ప్రారభించని కాంట్రాక్టర్ను తొలిగించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డీఈ మహేశ్ను ఎమ్మెల్యే ఆదేశించారు. 7వ వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని, 32 వార్డులో పార్కు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్లు కోరారు.
పట్ణణంలో లే అవుటను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇవ్వాలని కమిషనర్ శ్రీహరికి సూచించారు. టీయూఎఫ్ఐడీ ద్వారా పట్టణానికి త్వరలో రూ.21 కోట్లు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. వచ్చే నెలలో పురపాలక మంత్రి కేటీఆర్ రానున్నట్లు వెల్లడించారు. డిసెంబర్లో కలెక్టరేట్ ప్రారంభానికి సీఎం కేసీఆర్ కూడా వస్తారన్నారు. మిషన్ భగీరథ ప్రధాన పైపులైన్ మరమ్మతులు పూర్తి చేసి, తాగునీటిని సరఫరా చేయాలని మిషన్భగీరథ డీఈ దీనేష్కుమార్ను ఆదేశించారు. సమావేశంలో కౌన్సిలర్లు జయరాజ్, శ్రీనివాస్, శేఖర్, విశ్వం, సమియొద్దీన్, లలిత, కల్యాణి, మ మత, జయశ్రీ, లక్ష్మీనారాయణగౌడ్, యశోద, శంసున్నిసా బేగం, ఏఈలు బాలసాయిగౌడ్, కిష్టయ్య, టీపీఎస్ దేవరాజ్, శానిటరీ ఇన్స్పెక్టర్ చంద్రమోహన్ పాలొన్నారు.