నర్సాపూర్,సెప్టెంబర్30ః నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ధర్మశాలలో హిందూ వాహిని ఆధ్వర్యంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం యాదవ సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి హాజరై అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దేవి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడు ఉండాలని కోరారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరుగుతుందని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్పర్సన్ సునితాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని ఎల్లంకి డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర మహిళ కమిషన్ సునితాలక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులతో కలిసి ఆమె బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కె ట్ కమిటీ చైర్పర్సన్ అనసూయఅశోక్గౌడ్, ఎల్లంకి కళాశాల కరస్పాండెంట్ అశోక్కుమార్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సందీప్కుమార్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజు, మరియు విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డికి సన్మానం..
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 30ః జిల్లా కేంద్రంలో దుర్గమాత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. శుక్రవారం పలు దుర్గమాత మండపాల వద్ద నిర్వహకులు అన్నదానాలు చేపట్టుతుండగా, వేణుగోపాలస్వామి, ఫతేనగర్ మండపాల వద్ద నిత్యన్నదానాలు కొనసాగుతున్నాయి. వేణుగోపాలస్వామి ఆలయంలో గణేశ్ పంతులు ఆద్వర్యంలో హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వేణుగోపాల స్వామి దేవాలయంలోని దుర్గమాతను సందర్శించుకున్నారు. ఈ సందర్బంగా నిర్వహకులు మల్లేశం, వినోద్, శ్రీకాంత్, గోపి, సత్యనారాయణ,వంశీ, భరత్, నిఖిల్, శంకర్లు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు.
మహాలక్ష్మీదేవీగా సరస్వతీమాత
మెదక్రూరల్/ పాపన్నపేట/ కొల్చారం/ వెల్దుర్తి/ చిలిపిచెడ్/ చిన్నశంకరంపేట/ రామాయంపేట/ చేగుంట, సెప్టెంబర్ 30 : పేరూరు గ్రామ శివారులోని మంజీరాతీరంలో వెలిసినగరుడగంగ సరస్వతీ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సరస్వతీ అమ్మవారు మహాలక్ష్మీ దేవి రూపంలో దర్శనమిచ్చారు. వేకువ జామునే అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు . ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గోన్నారు.ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు మంజీర నదిలో పుణ్యస్నాలాచరించి సరసతీ ఆలయంలో మొక్కులు తీర్చుకున్నారు.