రేగోడ్, సెప్టెంబర్ 30 : మండలకేంద్రం రేగోడ్లో శుక్రవారం ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో మహిళకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్యె ల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరను అందజేస్తున్నారని తెలి పారు. కొత్వాల్పల్లి గ్రామానికి చెందిన నీరుడి లక్ష్మయ్యకు రూ.40వేల సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేశారు. కొత్వాల్పల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తల నీరుడి శంకర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి భార్య నీరుడి నవనీతకు రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కును అందజేశారు.
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని ఎమ్యెల్యే చంటి క్రాంతికిరణ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీడీవో సీతారావమ్మ, ఎంపీపీ సరోజన, ఐకేసీ సంగీత, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు రాజేందర్పాటిల్, మాజీ అధ్యక్షుడు వినోద్, ఎంపీటీసీ నర్సింహులు, సర్పంచ్ నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ రాజూయాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూంరెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రవీందర్, మహిళా అధ్యక్షురాలు నాగారం కల్పన పాల్గొన్నారు.
కార్యకర్తల కుటుంబాలకు బీమా అందజేత
చిలిపిచెడ్/ వెల్దుర్తి, సెప్టెంబర్ 30 : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని గౌతాపూర్ గ్రామానికి చెందిన బిట్ల సత్తయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీకి రూ.2 లక్షల ప్రమాదబీమా చెక్కును నర్సాపూర్లో తన స్వగృహంలో అందజేశారు. అభివృద్ధి, సం క్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని హామీనిచ్చారు.
మాసాయిపేట మండలకేంద్రానికి చెందిన జంగిటి బాల య్య, జంగిటి భూలక్ష్మి కొద్దిరోజుల క్రితం మృతి చెందారు. వీరిద్దరూ టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకోవడంతో రూ.2లక్షల చొప్పున ప్రమాదబీమా చెక్కులను మృతుల కుటుంబీకులకు ఎమ్మెల్యే మదన్రెడ్డి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మాసాయిపేట మండల అధ్యక్షుడు, మాసాయిపేట సర్పంచ్ మధుసూదన్రెడ్డి, కౌడిపల్లి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, వార్డు సభ్యుడు రమేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.