వృద్ధ్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత,బీడీ, గీత కార్మికులు, కిడ్నీ బాధితులకు పింఛన్ అందజేస్తూ సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారు. విధివంచితులు, అభ్యాగులకు తానున్నానే ధీమాను కల్పిస్తున్నారు. కేంద్రం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తుండగా, తెలంగాణలో సంక్షేమ పాలన కొనసాగుతున్నది. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయి. డబ్బు ఏండ్లలో జరగని అభివృద్ధి ఎనిమిదేండ్లలో చేసి చూపించారు. అన్నిరంగాల్లో తెలంగాణ దేశానికి రోల్ మోడల్గా మారింది. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే దేశం సైతం అభివృద్ధి చెందుతుందని అన్నివర్గాలు కోరుతున్నాయి.
సిద్దిపేట, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రం సాధించిన ఉద్యమ బిడ్డగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దేశంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రధానంగా పెట్రో,డీజిల్,గ్యాస్ తదితర వాటి ధరలు విపరీతంగా పెరగడం మూలంగా సామాన్య ప్రజలపై పెను భారం పడుతున్నది. వారి జీవనం కష్టతరంగా మారింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ప్రజలు విసుగు చెందారు.ప్రత్యామ్నాయ నేతలు, పార్టీల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రారంభిస్తుండడంపై యావత్తు దేశం తెలంగాణ వైపు చూస్తున్నది.
ఇటీవల దేశంలోని వివిధ రాష్ర్టాల్లో సీఎం కేసీఆర్ పర్యటించినప్పుడు అనూహ్య స్పందన వచ్చింది. అక్కడి ప్రజలు, నేతలు దేశం కోసం ముందుకు రావాలని కోరారు. ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ వైపు దేశం చూస్తున్నది. జాతీయ పార్టీ ఏర్పాటుపై అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. ముఖ్యంగా వృద్ధ్దులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఇలా అన్ని వర్గాల వారు స్వాగతిస్తున్నారు. అభాగ్యులకు అండగా నిలబడడానికి ప్రభుత్వం ఆసరా పింఛన్లు అందిస్తున్నది. ఆసరా పింఛన్లతో సామాజిక భద్రత కలుగుతున్నది. రూ. 75 ఉన్న పింఛన్ను సీఎం కేసీఆర్ ఏకంగా రూ. 2016 పెంచి అందిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తం పింఛన్ ఇవ్వడం లేదు.
దేశంలో సుమారుగా 16కి పైగా రాష్ర్టాల్లో బీజేపీ అధికారంలో ఉంది. డబుల్ ఇంజిన్ సర్కారు అని గొప్పగా చెప్పుకుంటున్నది. కానీ, ఎక్కడా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తరహాలో పింఛన్లు ఇవ్వడం లేదు. ఇవన్నీ ప్రజలను ఆలోపించజేస్తున్నాయి. దేశం అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని వారు అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శంగా మారాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కడా లేని విధంగా ఇంటింటికీ మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీరు అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కింది. ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహిస్తే దేశం సైతం అభివృద్ధి చెందుతుందని అన్నివర్గాలు కోరుతున్నాయి.
తెలంగాణలో ఉండే ప్రజలందరూ సీఎం కేసీఆర్ ఇస్తున్న సంక్షేమ పథకాలను ఏదో ఒక రకంగా పొందుతున్నారు. ఇంట్ల మనిషోలే కేసీఆర్ బతుకమ్మ పండుగకు ఆడవారందరికీ చీరలను ఇస్తున్నాడు. పింఛన్లు, రైతుబీమా, రైతుబంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాలతో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు పొందుతున్న పథకాలను వేరే రాష్ర్టాల వారు చుస్తూ మాక్కుడా ఇటువంటి సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇసోంటి సమయంలో కేసీఆర్ దేశంలో పార్టీ పెట్టాలి. దేశ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ ప్రధాని అవడం ఖాయం. – దూలం భూదవ్వ, నస్కల్, నిజాంపేట
వృద్ధులకు, వితంతు మహిళలకు పెద్దన్నగా ప్రతినెలా పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్న సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశప్రజలంతా సుభిక్షంగా ఉంటారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ఉన్నతంగా దూసుకుపోతుంది. దేశ రాజకీల్లోకి కేసీఆర్ తప్పకుండా రావాలి. – చౌరిగారి సావిత్రి, కొల్చారం
తెలంగాణ ప్రజలు బాగుండాలని కేసీఆర్ సార్ ఎన్నో కష్టాలు పడి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించాడు. ప్రజలు మంచిగా ఉండాలని మస్తు పథకాలు అమలు చేస్తుండు. బీడీలు చేసేటోళ్లకు, ఒంటరి మహిళలకు, మా వంటి వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నాడు. రాష్ట్రంలో వలే ఢిల్లీలో సీఎం కేసీఆర్ చక్రం తిప్పే సమయం వచ్చింది.
– రాంపురం నిర్మల, నస్కల్, నిజాంపేట
ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యంతో ఆసరా పింఛన్ ద్వారా నాకు ప్రతినెల రూ.2,016 చేయూత అందుతున్నది. దీంతో నేను ఎవరిపై ఆధారపడకుండా ఉంటున్నాను. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్తున్నరనడం శుభపరిణామం. దేశంలో చాలామంది నాలాంటి వితంతువులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసీఆర్ దేశప్రధాని అయితే స్వరాష్ట్రంలో అందుతున్న పింఛన్ దేశంలోని ప్రతి వితంతువుకు అందుతుందని ఆశిస్తున్నా.
– బిరాదర్ ఆహల్యాబాయి, బోర్గి, కంగ్టి
రాష్ట్రంలో ప్రతి పింఛనుదారుకి సీఎం కేసీఆర్ పెద్దకొడుకు అయ్యాడు. వృద్ధులకు, వితంతువులకు, ది వ్యాంగులకు, ఒంటరి మహిళలకు ప్రతినెలా పింఛన్ వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం రూ.2 వందలే వచ్చేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రూ. రెండువేల పింఛన్ ఇస్తున్నడు. ఇప్పుడు ఎవరిపై ఆధారపడకుండా బతుకుతున్నామంటే అది కేసీఆర్ చలువే. ఇక దేశానికి ప్రధానమంత్రి కేసీఆర్ సార్ అయితే దేశంలో ఉన్న అర్హులందరికీ పింఛన్ వస్తది.
– బేగరి నర్సింహ, అన్నారం, గుమ్మడిదల మండలం
పేదలందరి ఆత్మబంధువు సీఎం కేసీఆర్. తెలంగాణను సాధించిన అనతి కాలంలోనే దేశంలోనే నెంబర్వన్గా నిలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేందుకు ముందుండాలి. సబ్బండ వర్గాల ఆకాంక్ష మేరకు దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లాల్సిన అవసరం ఉన్నది.
– కొండా రాములు, పైతర, కొల్చారం
దేశంలో కేసీఆర్ సార్ కంటే మం చి మనసున్న రాజకీయ నాయకుడు మరెవ్వరూ లేరు. ఏ రాష్ట్రం లో లేనివిధంగా సీఎం కేసీఆర్ సార్ 57 ఏండ్ల వయసు నిండిన వాళ్లకు కూడా పింఛన్ ఇస్తున్నడు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది.