మెదక్ జిల్లా నెట్వర్క్, సెప్టెంబర్ 25:తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపంగా నిలిచే బతుకమ్మ సంబురాలు జిల్లావ్యాప్తంగా ఆదివారం కొనసాగాయి. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చి అందంగా తయారు చేశారు. పట్టణాలు, గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాల్లో బతుకమ్మలను పెట్టి, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యా లో.. అంటూ ఆనందోత్సవాలతో ఆడిపాడారు. జిల్లా కేంద్రం మెదక్లో ఆలయాలు, వీధులు, కాలనీలు, ప్రధాన కూడళ్లలో మహిళలు బతుకమ్మ సంబురాల్లో పాలు పంచుకున్నారు. బతుకమ్మలను స్థానిక చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. అనంతరం మహిళలు ఒకరికోకరు వాయినాలను ఇచ్చి, పుచ్చుకున్నారు. ఇంటి నుంచి తెచ్చిన ఫలహారాలను ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు. మెదక్ మండలంలోని మంబోజిపల్లి, రాజ్పలి, పేరురూలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు, చిన్నశంకరంపేట మండలంలో పెద్దర అమా వాస్య నిర్వహించి, పెద్దలకు బియ్యాన్ని సమర్పించారు. మహిళలు తీరొక్కపువ్వుతో బతుకమ్మలను పేర్చి ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి బతుకమ్మ ఆడారు. రామాయంపేట పట్టణంలోని హనుమ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. చేగుం ట, నిజాంపేట, చిలిపిచెడ్, కొల్చారం మండలాల్లో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.