జిల్లావ్యాప్తంగా ఎంగిలి పూల బతుకమ్మతో పూల జాతర శనివారం నుంచి ప్రారంభమయ్యాయి. మహిళలు రంగురంగల పూలతో బతుకమ్మలను అలంకరించి పట్టణాలు, గ్రామా ల్లోని ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. మన సంస్కృతి, సంప్రదాయలకు అద్దం పెట్టే పండుగ బతుకమ్మ. ఆడపడు చులు బతుకమ్మ ఆటపాటలు ఆడిన అనంతరం చెరువులు, కాలువల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఇస్తినమ్మా వా యినం.. పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ ఆత్మీయ పలకరింపుతో వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.
జిల్లా కేంద్రం మెదక్లోని కోదండ రామాలయంలో కొలిగడ్డ, నవాబుపేట, వెంకటేశ్వర కాలానీ, ఫతేనగర్ తదితర ప్రాంతాల్లో తోలి రోజు మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మ ఆటలు ఆడిపాడారు. తెలంగాణ అస్తిత్వానికి నిలువటద్దం బతుకమ్మ అని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ అధికారి బ్రహ్మజీ అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో బతుకమ్మసంబురాలు నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలను వైభవంగా నిర్వహించారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో బతుకమ్మ సంబురాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ హేమలతాగౌడ్ ఉపాధ్యాయులు, విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడి, పాడారు.