నర్సాపూర్, ఫిబ్రవరి 13 : ప్రభుత్వం రోడ్ల నిర్మాణాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టి పల్లెవాసులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించింది. గత పాలకుల నిర్లక్ష్యంతో.. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలకు గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు తదితర రోడ్ల నిర్మాణాలను టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి పల్లెవాసులకు రవాణా సౌకర్యం సాఫీగా చేసింది. వర్షాలకు దెబ్బతిన్న నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి, కొల్చారం, శివ్వంపేట్, చిలిపిచెడ్, వెల్దుర్తి మండలాలకు బీటీ రోడ్ల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మొత్తం 25.95 కి.మీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి గానూ రూ. 6.70 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కొల్చా రం మండల పరిధిలోని కొల్చారం నుంచి సంగాయిపేట్ వరకు 2.80 కి.మీటర్లకు గానూ రూ. కోటి 5లక్షల నిధులు కేటాయించింది. శివ్వంపేట్ మండల పరిధిలోని ఎస్ఎన్టీ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కానుకుంట వరకు 4.85 కి.మీటర్లకు గానూ రూ. కోటి 30 లక్షల నిధులను విడుదల చేసిం ది. వెల్దుర్తి మండల పరిధిలోని పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కుకునూర్ వరకు 3.50 కి.మీటర్లకు గానూ రూ. 65 లక్షల నిధులను కేటాయించింది.
గ్రామాలకు మహర్దశ
బీటీ రోడ్ల పునరుద్ధ్దరణతో గ్రామాలకు మహర్దశ రానున్నది. వరదలకు రోడ్లు పాడవడంతో ఇన్నాళ్లు పడిన ఇబ్బందులు తొలగనున్నాయి. సుమారు 35 గ్రామాలకు ప్రయాణం సులభతరం కానున్నది. త్వరలోనే టెండర్లకు ఆహ్వానం పలికి పనులు ప్రారంభిస్తామని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖ అధికారులు వెల్లడించారు.
త్వరలోనే పనులు ప్రారంభిస్తాం
ప్రభుత్వం బీటీ రోడ్ల పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించింది. త్వరలోనే టెండర్లను పిలిచి నెల లోపు పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. పనుల్లో నాణ్యత తగ్గకుండా జాగ్రత్త వహిస్తాం.
– కనకరత్నం,పంచాయతీరాజ్ ఈఈ
నిధుల మంజూరు హర్షణీయం
బీటీ రోడ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. ప్రతి రోజూ శివంపేట్కు వెళ్లాలంటే నానా అవస్థలు పడేవాళ్లం. రోడ్డు పునరుద్ధ్దరణతో కష్టాలు తీరనున్నాయి.
-ఇంద్రేష్, నవాబ్పేట, శివంపేట్
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
రోడ్డు పునరుద్ధ్దరణకు నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మదన్రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంటి నుంచి మండల కేంద్రానికి వెళ్లా లంటే చాలా సమయం పట్టేది. పైగా వాహనాలు చెడిపోయేవి. రోడ్డు పునరుద్ధరణ తర్వాత ఈ కష్టాలన్నీ తొలగిపోనున్నాయి.
-దుర్గప్రసాద్,మూసాపేట్, నర్సాపూర్
రోడ్ల నిర్మాణంలో రాజీ లేదు..
రోడ్ల నిర్మాణంలో ఎలాంటి రాజీపడే ప్రసక్తే లేదు. గత ప్రభుత్వాలలో ఎన్నడూ లేని విధంగా, మారుమూల తండాలకు కూడా సీసీ రోడ్లను నిర్మించాం. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఇన్నాళ్లు పడిన ఇబ్బందులు.. ఇప్పుడు రోడ్ల పునరుద్ధ్దరణతో తొలగనున్నాయి.
-చిలుముల మదన్రెడ్డి, ఎమ్మెల్యే