సంగారెడ్డి అర్బన్, జూలై 5: జిల్లాలో వంద శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరగాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వైద్యారోగ్య శాఖ, ఐసీడీఎస్, వైద్యులు, సీడీపీవోలు, సూపర్వైజర్లతో సమావే శం నిర్వహించారు. ప్రధానంగా గర్భిణుల నమో దు, ప్రభుత్వ దవాఖానల్లో కాన్పులు, సిజేరియ న్లు, ఇమ్యూనైజేషన్ తదితవ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ దవాఖానల్లో వంద శాతం ప్రసవాలు జరుగాలని, వైద్యారోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సాధారణ ప్రసవాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. వంద శాతం ఇమ్యునైజేషన్ జరగాలన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూపర్వైజర్లకు సూచించారు.
అంగన్వాడీ డేను విధిగా జరపాలని, తల్లీబిడ్డల సురక్షితానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణి వివరాలు తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని సూచించారు. పీహెచ్సీ వారీగా ఏఎంసీ రిజిస్టర్ నిర్వహించాలని, అంగన్వాడీ సెంటర్కు విధిగా ఏఎన్ఎంలు వెళ్లాలన్నారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరగాలన్నారు. పీహెచ్సీల పనితీరును డిప్యూటీ డీఎంహెచ్వోలు నిత్యం పర్యవేక్షించాలన్నారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా అన్నివిధాల చర్యలు చేపట్టాలన్నారు. అంగన్వాడీ సూపర్వైజర్లు గ్రామాల్లో టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో ఉచిత చికిత్స, మందులతో పాటు నెలకు రూ.500 అందించనున్ను ట్లు తెలిపారు. ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద సర్జరీలు రెగ్యులర్గా చేయాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. మెడికల్ కళాశాల నిర్మాణ పనులు పురోగతిని ఆర్అండ్బీ అధికారులతో ఆరా తీశారు. ఈ నెల 15లోపు అన్ని పనులు పూర్తిచేయాలన్నా రు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాజర్షిషా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ గాయత్రీదేవి, డీసీహెచ్ఎస్ డాక్టర్ సంగారెడ్డి, డాక్టర్లు, ఏరియా దవాఖానల సూపరింటెండెంట్లు, ఐసీడీఎస్ అధికారి పద్మావతి, సీడీపీవోలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.
సంగారెడ్డి అర్బన్, జూలై 5 : డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని సంగారెడ్డి కలెక్టర్ శతర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో హౌసింగ్ నోడల్ అధికారి, సంబంధిత ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తయిన ఇండ్లను ప్రారంభించేందుకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ దశల్లో పనులను త్వరితగతిన పూర్తిచేయాన్నారు. జిల్లాలో ఆయా సైట్లలో చేపట్టిన నిర్మాణాలు ఎన్ని, పూర్తయినవి ఎన్ని, పూర్తయిన వాటిలో మౌలిక సౌకర్యాల వివరాలు సమర్పించాలన్నారు.
పనులు ఏ దశలో ఉన్నాయో వివరాల నివేదికను అందజేయాలని హౌసింగ్ నోడల్ అధికారికి సూచించారు. లబ్ధిదారులకు ఇండ్లను అందించేందుకు వేగంగా పనులు పూర్తిచేయాలని ఏజెన్సీలకు సూచించారు. లబ్ధిదారుల ఏంపిక జాబితా సిద్ధం చేయాలన్నారు. సమీక్షలో హౌసిం గ్ నోడల్ అధికారి తుమ్మ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు, ఆర్అండ్బీ ఈఈ సురేశ్, పంచాయతీరాజ్ శాఖ ఈఈ జగదీశ్వర్ పాల్గొన్నారు.