మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : గర్భస్థ శిశువు నుంచి వృద్ధాప్యంలో చనిపోయేవరకు ఆకలితో అలమటించకుండా ప్రతి ఒకరికీ ఆహార భద్రత కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. అంతర్జాతీయ ఆహార దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లోని ప్రజావాణిలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతంలో సరైన వర్షాలు లేక పంట లు పండక ఆకలి చావులు చూశామని, ఇకముందు ఆకలి చావుల దుస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకొంటున్నామన్నారు. ఆకలిచావుల నివారణకు మన దేశంలో జాతీయ ఆహార భద్ర త చట్టం 2013ను అమలు చేస్తూ చౌకధరల దుకాణాల ద్వారా రేషన్కార్డు దారులకు, అంగన్వాడీ కేంద్రాలకు పాఠశాలలో మధ్యాహ్నం భోజనానికి బియ్యం సరఫరా చేస్తున్నామన్నారు.
జిల్లాలో 2లక్షల 13వేల రేషన్ కార్డు దారులకు ప్రతినెలా బియ్యం అందజేస్తున్నామన్నారు.
రక్తహీనతతో ఆడపిల్లలు బాధపడుతున్నారని, ప్రతి ఒకరూ సమతుల్యమైన, నాణ్యమైన పౌష్టికాహారాన్ని తీసుకోవాలని అప్పుడే ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించిన వారమవుతామన్నా రు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార ప దార్థాలు కలుషితమయ్యాయని, ఉన్నదాంట్లో నాణ్యమైన ఆహార పు అలవాట్లు చేసుకోవాలన్నారు.
జంక్ ఫుడ్ తినొద్దని, సేంద్రి య వ్యవసాయ పద్ధతిలో పండించిన ఆకు కూరలు, కాయగూర లు, ఆహార ధాన్యాలు, పండ్లు తీసుకోవాలని సూచించారు. నేటి బాలలే రేపటి పౌరుల ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు, వసతి గృహాల ద్వారా విద్యార్థులకు పౌష్టికాహా రం అందించాలన్నారు. అందరికీ ఆహార భద్రత కల్పించాలన్నదే ఆహార భద్రత కమిషన్ లక్ష్యమన్నారు. న్యూట్రీషన్ గార్డెన్లపై పిల్లలకు అవగాహన కలిగించాలని డీఈవోకు సూచించారు.
అనంతరం డీఆర్డీవో శ్రీనివాస్ మాట్లాడుతూ సరైన ఆహారం, వ్యక్తికీ సరైన సమయంలో అందుతున్నాదా చూడటమే ఆహార భద్రత కమిషన్ ధ్యేయమన్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక కుటుంబం ఆహార భద్రత పొం దే హకు ఉందన్నారు. ప్రజల్లో అవగాహన లేక కృత్రిమ ఆహార కొరత సృష్టిస్తూ హకులకు భంగం కలిగినప్పుడు వెంటనే అధికారులకు తెలుపాలని సూచించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి మనిషి ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఆహారంతో పా టు, గాలి, నీరు ఎంతో అవసరమన్నారు. ప్రభుత్వాలు కూడా ఆహారం, ఆరోగ్య విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు.
జిల్లాలో షెల్టర్ హోమ్లు ఏర్పా టు చేసి ఆహారాన్ని అం దిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి లో జరిగిన వ్యాసరచన పోటీల్లో 104మంది, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 4, పోస్టర్లు 41, 3నుంచి 6నిమిషాల నిడివి గల షార్ట్ వీడియోలు 7 జిల్లా నుంచి పంపా రు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు, అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞాపికలను అదనపు కలెక్టర్ రమేశ్ అందజేశారు. కార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్, డీఎంహెచ్వో విజయ నిర్మల, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సెక్టోరల్ అధికారి సూర్యప్రకాశ్, డిడబ్ల్యూవో బ్రహ్మాజీ, జిల్లా వినియోగదారులు ఫోరమ్ అధ్యక్షుడు వెంకటేశ్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.