మెదక్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : కొత్త కలెక్టరేట్ నుంచి పాలన ప్రారంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాల భవనాలను బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కొత్త కలెక్టరేట్ వేదికగా పరిపాలన మొదలైంది. ప్రజలు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మించిన ఈ భవనంలో విశాల వరండాలు, పెద్ద గదులతో నిర్మాణాలు చేపట్టారు. మెదక్ జిల్లా కేంద్రంలోని ఔరంగాబాద్ శివారులో 32 ఎకరాల్లో కలెక్టరేట్ భవనం మొత్తం జీ ప్లస్ టు అంతస్తుల్లో లక్షా 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో 50వేల చదరపు అడుగులు, మొదటి అంతస్తు 50వేల చదరపు అడుగులు, రెండో అంతస్తులో 20వేల చదరపు అడుగులో నిర్మించారు. నూతన కలెక్టరేట్లో ఆయా శాఖల వారీగా గదుల కేటాయింపు పూర్తయింది. వారం రోజులుగా పాత కార్యాలయాల్లోని ఫైళ్లను కొత్త భవనానికి తరలిస్తున్నారు. నూతన కలెక్టరేట్ కాంప్లెక్స్లోని 36 శాఖలు కలెక్టరేట్ నుంచే పాలన కొనసాగించనున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్తోపాటు రెండు అంతస్తుల్లో కలెక్టర్, అదనపు కలెక్టర్లతోపాటు ఆయా శాఖల కార్యాలయాలు, సమావేశ మందిరం, విశాల వరండాలతో భవనాన్ని నిర్మించారు. భవన సముదాయం చుట్టూ ఆహ్లాదకర వాతావర ణం, పచ్చని చెట్లు, ఉద్యానవనం, పారింగ్ కోసం ప్రత్యేక స్థలం, మూత్రశాలలు ఏర్పాటు చేశారు. క్యాంటీన్, భోజనశాల, ఏటీఎం, బ్యాంకు, మీసేవ ఏర్పాటు చేయాల్సి ఉంది.
గ్రౌండ్ ఫ్లోర్ లో జీ1/1లో పోస్టాఫీస్, పెన్షనర్స్ రూం, జీ1/2లో జిల్లా ఫారెస్ట్ కార్యాలయం, జీ2లో ఏటీఎం, జీ3లో షాప్, జీ4లో ప్రథమ చికిత్స కేంద్రం/అంగన్వాడీ/క్రెంచి, జీ5లో ఎన్ఐసీ, ఈడీఎం, టీఎస్స్వాన్, టీ ఫైబ్రి, వీసీ హాల్, ధరణిసెల్, జీ 6లో జిల్లా ట్రెజరీ కార్యాలయం, జీ7లో భూగర్భ జల శాఖ కార్యాలయం, జిల్లా వోకేషనల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, యువజన, క్రీడల ఆఫీసర్, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, జీ8లో జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయం, జీ 9లో కలెక్టరేట్ రికార్డు రూం, జీ 10, 11లో మూత్రశాలలు, జీ 12లో కలెక్టరేట్, జీ 13లో ఇన్వార్డు, ఔట్వార్డు (కలెక్టరేట్), జీ 14, 15లో మూత్రశాలలు, జీ 16లో సర్వర్ రూం, జీ 17లో కలెక్టరేట్ సెక్షన్స్(ఎఫ్, జీ అండ్హెచ్1), జీ 18లో ఎలక్టిసిటీ రూం, జీ 19లో స్టాంగ్ రూం సెక్యూరిటీ(డీటీవో), జీ 20లో స్టోర్ రూం(డీటీవో), జీ 21లో లంచ్ రూం, జీ 22లో అటెండర్స్ వెయిటింగ్ రూం, జీ 23లో అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్, జీ 24లో కలెక్టరేట్ సెక్షన్స్(ఏబీసీడీఈ అండ్ హెచ్), జీ 25లో స్టోర్ రూం(కలెక్టరేట్), జీ 26లో అదనపు కలెక్టర్(రెవెన్యూ)(హెచ్వోడీ), యాంటీ రూం, జీ 27లో పీఏ టూ అదనపు కలెక్టర్(రెవెన్యూ), జీ 28,29లో మూత్రశాలలు, జీ 30లో సర్వర్ రూం, జీ 31లో ఎలక్టిసిటీ రూం, జీ 32లో వికలాంగుల వెల్ఫేర్ ఆఫీసర్, జీ 33లో కలెక్టరేట్, జీ 34, 35లో జనరల్ మూత్రశాలలు, జీ 3లలో మీటింగ్ హాల్, మీటింగ్ హాల్ లాబీ, మీటింగ్ హాల్ ప్యాంట్రీ 1, ప్యాంట్రీ 2, జీ 37లో వెయిటింగ్ హాల్, జీ 38లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పీఏ, జీ 39లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జీ 40లో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్, జీ 41లో పీఏ టు కలెక్టర్, జీ 42లో కలెక్టర్ రూంను కేటాయించారు.
ఎఫ్1/ఏ, ఎఫ్1/బీ గదులను డీఆర్డీఏ సెర్ఫ్ విభాగానికి, ఎఫ్2లో జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయం, ఎఫ్3లో జిల్లా పౌర సరఫరాల శాఖ కార్యాలయం, ఎఫ్4 లో జిల్లా మేనేజర్(టీఎస్సీఎస్సీఎల్)(హెచ్వోడీ), ఎఫ్ 5లో జిల్లా మేనేజర్ (టీఎస్సీఎస్సీఎల్) విభాగానికి, ఎఫ్6, ఎఫ్7లో మూత్రశాలలు, ఎఫ్8లో స్త్రీనిధి కార్యాలయం, ఎఫ్9, ఎఫ్10లో మూత్రశాలలు, ఎఫ్ 11లో సర్వర్ రూం ఏర్పాటు చేశారు. ఎఫ్ 12లో మొదటి అంతస్తు కాన్ఫరెన్స్ రూం, ఎఫ్ 13లో ఎలక్టిసిటీ రూం, ఎఫ్14లో జిల్లా కోఆపరేటీవ్ ఆఫీసర్ కార్యాలయం, ఎఫ్ 15లోజిల్లా కోఆపరేటీవ్ ఆఫీసర్(హెచ్వోడీ), ఎఫ్ 16లో క్యాంటీన్, ఎఫ్ 17లో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ,ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలు, జిల్లా టైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం, ఎఫ్18లో జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్(హెచ్వోడీ), ఎఫ్ 19లో బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్, స్టాఫ్, ఎఫ్ 20, 21లో మూత్రశాలలు, ఎఫ్ 22లో సర్వర్ రూం, ఎఫ్ 23లో ఎలక్టిసిటీ రూం, ఎఫ్ 24లో జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం, ఎఫ్ 25/1లో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ కార్యాలయం, ఎఫ్ 25/2లో జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం, ఎఫ్ 26లో జిల్లా విద్యాధికారి కార్యాలయం, ఎఫ్ 27లో జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం, ఎఫ్ 28లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(హెచ్వోడీ), ఎఫ్ 29లో స్టేట్ చాంబర్లు కేటాయించారు.
ఎస్1/ఏలో ఇరిగేషన్ శాఖ కార్యాలయం, ఎస్1/బీలో జిల్లా పశు సంవర్ధక శాఖ కార్యాలయం, ఎస్ 2లో పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం(హెచ్వోడీ), ఎస్3లో పంచాయతీరాజ్ ఈఈ కార్యాలయం, ఎస్ 4లో అసిస్టెంట్ డైరెక్టర్(మైన్స్, జియోలజీ), ఎస్ 5, 6, మూత్రశాలలు, ఎస్ 7లో సర్వర్ రూం, ఎస్ 8లో కలెక్టరేట్ (మినీ కాన్ఫరెన్స్ హాల్), ఎస్ 9లో ఎలక్టిసిటీ రూం, ఎస్ 10లో సర్వే ల్యాండ్స్ అండ్ రికార్డ్, ఎస్ 11,12లో మూత్రశాలలు, ఎస్ 13లో ఉద్యనవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయం, ఎస్ 14లో పంచాయతీరాజ్ ఎస్ఈ కార్యాలయం, ఎస్ 15లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (హెచ్వోడీ), ఎస్ 16లో చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (స్టాఫ్), ఎస్ 17లో మెప్మా కార్యాలయం, 2బీహెచ్కే నోడల్ ఆఫీసర్, టీఎస్ఈడబ్ల్యుడీసీ ఈఈ, మత్స్యశాఖ కార్యాలయాలు, ఎస్ 18లో లీగల్ మెట్రాలజీ, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఎస్ 19లో జిల్లా ఆడిట్ కార్యాలయం, ఎస్ 20లో జిల్లా ఆడిట్ కార్యాలయ స్టాఫ్, ఎస్ 21, 22లో మూత్రశాలలు, ఎస్ 23లో సర్వర్రూం, ఎస్ 24లో ఎలక్టిసిటీ రూం, ఎస్ 25లో అసిస్టెంట్ కలెక్టర్(అండర్ టైనీ), ఎస్ 26లో జిల్లా వైద్యాధికారి కార్యాలయం, ఎస్ 27లో కలెక్టరేట్, ఎస్ 28లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఎస్ 29లో క్యాంటీన్లకు కేటాయించారు.
సమీకృత కలెక్టరేట్ నుంచి పరిపాలనను మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖలు తమ కార్యకలాపాలను కలెక్టరేట్ నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన కోటి మొ కల దశాబ్ది వన కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా జిల్లాలోని ఆయా శాఖలకు కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తిస్థాయిలో సాధించడంతోపాటు నాటిన మొకల సంరక్షణ బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రమేశ్, వెంకటేశ్వర్లు, జడ్పీసీఈఓ శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీఎఫ్వో రవిప్రసాద్, డీఎంహెచ్వో చందూనాయక్, ఆర్డీవో అంబదాస్ రాజేశ్వర్, మెదక్, తూప్రాన్, రామాయంపేట, నర్సాపూర్ మున్సిపల్ కమిషనర్లు, సంబంధి త అధికారులు పాల్గొన్నారు.