మర్కూక్, జూలై 24 : చదువుకు పేదరికం అడ్డు కాదని, గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎందరలో విద్యార్థులు దేశంలో ఉన్నత స్థానంలో ఉన్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని చేబర్తి ప్రాథమిక పాఠశాలలో మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో విద్యార్థులకు మండల ప్రజాప్రతినిధులు పాండుగౌడ్, జడ్పీటీసీ మంగమ్మారాంచంద్రం, వైస్ ఎంపీపీ మంద బాల్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు క్రీడా దుస్తులను గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మర్కూక్ ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు పేదరికం అడ్డుకాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ విద్యనందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు మర్కూక్ మండల ప్రజాప్రతినిధుల సహకారం అభినందనీయమన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులపై దృష్టి పెట్టాలని వారు సూచించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గజ్వేల్ మండల అధ్యక్షుడు బెండ మధు, రాందాస్గౌడ్, రంగారెడ్డి, బాల్నర్సయ్య, గ్యార మల్లేశ్, గంగిశెట్టి రాజు, రాములు, ఉప సర్పంచ్, నర్సింలు, జయరాం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.