రామాయంపేట, జూలై 24: మెదక్ జిల్లాలోనే రామాయంపేట ప్రాంత రైతాంగం అత్యధికంగా ధాన్యం పండిస్తారని, అందుకే అక్కన్నపేట రైల్వేస్టేషన్లో రేక్ పాయింట్ ఏర్పాటుకు కృషి చేస్తానని మెదక్ ఎంపీ.కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మహంకాళీ అమ్మవారి బోనాలకు విచ్చేసిన ఎంపీ ఆలయంలో అమ్మవారికి పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అక్కన్నపేటకు చరిత్ర ఉందని, తాను ఎప్పుడూ ఈ ప్రాంత అభివృద్ధినే కోరుకుంటానని అన్నారు.
అక్కన్నపేటలోనే ధాన్యం నిల్వ కోసం రేక్ పాయింట్ ఏర్పాటు చేయిస్తానన్నారు. ఇందుకు ప్రతిపాదనలు కూడా త్వరలోనే పంపిస్తానన్నారు. అక్కన్నపేట రైల్వే స్టేషన్లో ఎక్స్ప్రెస్ రైలు నిలిపేందుకు కృషి చేస్తానన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం వ్యాప్తంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోనే తూప్రాన్ మండలం నాగులపల్లి, చేగుంట మండలం రెడ్డిపల్లి, నార్సింగి మండలం జప్తిశివునూరులో ఫ్లైఓవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు.
ఇప్పటికే నాగులపల్లి బ్రిడ్జిని ప్రారంభించుకున్నామన్నారు. రామాయంపేట మండల అభివృద్ధిపై ప్రత్యేక నిధులు సమకూరుస్తానన్నారు. ఇప్పటికే రూ.20లక్షలను ఎంపీ కోటా నుంచి కేటాయించినట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ కృషితో మెదక్ జిల్లాలోని మూడు కొత్త మండలాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేటీఆర్ జన్మదినం సందర్భం గా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాల ని అమ్మవారికి మొ క్కులు తీర్చుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బక్కి వెంకటయ్య, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, చైర్మన్ పాండురంగాచారి, ఈవో మోహన్రెడ్డి, ఏఈవో శ్యాంరాజు, కౌన్సిలర్ దేమె యాదగిరి, దేవుని రాజు, సిబ్బంది యాదగిరి, సత్యం, కాలేరు ప్రసాద్ ఉన్నారు.