సిద్దిపేట, మే 26 : సిద్దిపేట పాత బస్డాండ్కు కొత్త కళ వచ్చింది. ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు కృషితో బస్టాండ్ పునర్నిర్మాణం పూర్తవుతున్నది. నాటి మంత్రి చొక్కారావు వేసిన పునాది 2 వేల మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేది. నేటి మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవతో 24 వేల మంది ప్రయాణికులకు సరిపడేలా అధునాతన సౌకర్యాల కల్పనతో ప్రా రంభానికి సిద్ధమవుతున్నది. ఈ మేరకు బస్డాండ్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
గురువారం పనులను మంత్రి హరీశ్రావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేవిధంగా నిర్మాణం చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 9 బస్టాప్లతో నిర్మితమవుతున్న పనులు క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. బస్డాండ్కు వచ్చే ప్యాసింజర్లు, ప్రయాణికులకు మోడ్రన్ టాయిలెట్స్, క్యాంటీన్, దుకాణ సముదాయం, బస్డాండ్లో దాదాపు 20 వరకు ప్లాట్ఫాం వచ్చేలా డిజైన్లకు అనుగుణంగా పనులు ఆర్టీసీ అధికారులు వివరించారు. మంత్రి వెంట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.