రామాయంపేట, మార్చి 23 : మెదక్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజార్టీతో విజయం సాధించి అధినేత కేసీఆర్కు కానుక ఇద్దామని అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రామాయంపేట, నిజాంపేట మండలాల వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసి పనిచేస్తే విజయం తమదేనని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కొద్ది ఓట్లతో మెదక్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోయామని, పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించి సత్త్తాచాటుదామని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు, మెదక్ అసెంబ్లీ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, రామాయంపేట, కల్వకుంట పీఏసీసీఎస్ చైర్మన్లు అందె కొండల్రెడ్డి, బాదె చంద్రం, కో ఆప్షన్ సభ్యుడు ఎస్కే హైమద్, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, అస్నోద్దీన్, మర్కు దత్తు, శ్రీనివాస్, చింతల యాదగిరి, కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.