నర్సాపూర్,మే30: కరోనా రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర టీఆర్ఎస్ యువజన నాయకుడు విక్రమ్ రెడ్డి నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్(ఆక్సిజన్ పునరుత్పత్తి పరికరం)ను విరాళంగా అందజేశారు. ఆదివారం ఎస్సై గంగరాజు ప్రభుత్వ దవాఖానకు అందజేశారు ఈ సందర్బంగా టీఆర్ఎస్ రాష్ట్ర యు వజన నాయకుడు చిలుముల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఈ పరికరం కరోనాతో బాధపడుతున్న వారికి అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. లక్ష రూపాయలు విలువ చేసే ఆక్సిజన్ పరికరాన్ని నా మిత్రుడు సాయిరాం పిళ్లారిశెట్టి సహకారంతో విదేశాల నుంచి దిగుమతి చేశామని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు గౌడ్, చండి ప్రసాద్గౌడ్, శ్రీకాంత్ గౌడ్, దినేష్గౌడ్, లక్ష్మారెడ్డి, సాయి పాల్గొన్నారు.