తూప్రాన్ రూరల్, మే 26 : ఆపద సమయంలో పార్టీ కార్యకర్తలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ (ఎఫ్డీసీ) చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. గతేడాది పట్టణ పరిధిలోని అల్లాపూర్కు చెందిన మన్నె చిన్నబాగులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడికి టీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో బుధవారం అతని కుటుంబ సభ్యులకు రూ.2 లక్షల ఇన్సూరెన్స్ బీమా చెక్కును ఆయన అందజేశారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో లక్ష సభ్యత్వాలు నమోదు చేశామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం అన్నారు. వివిధ కారణాలతో మృతి చెందిన కార్యర్తల కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ వారి కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, జడ్పీటీసీ రాణీసత్యనారాయణ, టీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, అంజాగౌడ్, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.