రామాయంపేట, ఏప్రిల్ 26: నిరుపేదల కోసం తక్కువ ఖర్చుతో హోం ఐసొలేషన్ ప్రారంభించామని కరోనా వచ్చినవారు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం రామాయంపేట శివారులోని దామరచెర్వు రోడ్డులో నూతనంగా అన్ని హంగులతో హోం ఐసొలేషన్ ఏర్పాటు చేశామన్నారు. ఐసొలేషన్లో అన్ని రకాల ఆక్సిజన్ ఇతర సదుపాయాలు ఉంటాయన్నారు. రామాయంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దామరచెర్వు గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇబ్బందులు తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ శివప్రసాద్, చంద్రశేఖర్కు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చైర్మన్ సరాఫ్ యాదగరి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రం, కౌన్సిలర్ దేమె యాదగిరి, రాజు, అనిల్, చింతల యాదగిరి, దేవుని జయరాజు, బాలుగౌడ, కన్నపురం కృష్ణాగౌడ్ తదితరులున్నారు.
100 మందికి కరోనా టీకా
రేగోడ్, ఏప్రిల్ 26: మండల వ్యాప్తంగా కరోనా టీకా వేసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతున్నది. కొత్వాన్పల్లి లో ఏర్పాటు చేసిన శిబిరంతో పాటు రేగోడ్ దవాఖానలో 100 మందికి టీకాను వేశారు. 54 మందికి కరోనా పరీక్షలు చేయగా 15 మందికి పాజిటివ్ వచ్చిందని సీహెచ్వో సిద్ధప్ప తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ ఈశ్వర్గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షు డు రవీందర్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
మెదక్రూరల్..
మెదక్రూరల్ , ఏప్రిల్ 26: ప్రతి ఒక్కరూ వ్యాక్సి న్ వేయించుకోవాలని సర్పంచ్ మాధవి రవీందర్ అన్నారు. మెదక్ మండలంలోని శివాయిపల్లిలో కరోనా టీకా శిబిరాన్ని సర్పంచ్ మాధవి వైద్యసిబ్బందితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రవీందర్ వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.
హవేళిఘనపూర్….
హవేళిఘనపూర్, ఏప్రిల్ 26: ఫరీద్పూర్లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని సర్పంచ్ సౌందర్య ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్దన ప్రాథమిక ఆరోగ్య కే్ంర దం వైద్యులు గ్రామస్తులకు కరోనా వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీరామ్, ఎంపీటీసీ రాజయ్య, మాజీ సర్పంచ్ బ్రహ్మం, టీఆర్ఎస్ నాయకులు వినోద్ ఉన్నారు