మున్సిపాలిటీలో 3.20 లక్షల మొక్కలు లక్ష్యం
6 నర్సరీలు.. ఒక్కో నర్సరీలో 50 వేలకు పైగా మొక్కలు అందుబాటులో
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 22: ప్రభుత్వం రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. ఈ ఏడాది ఏడో విడతకు సిద్ధమవుతున్నది. జూలై 1వ తేదీ నుంచి పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతితో పాటు హరితహార కార్యక్రమాలను రెండు సంవత్సరాలుగా మున్సిపాలిటీల్లో గ్రీన్ఫండ్తో నర్సరీల్లో మొక్కల పెంపకానికి మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే హరితహారానికి మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో ఖాళీ స్థలాలు గుర్తించి మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పట్టణంలోఆరు నర్సరీలు..
జిల్లా కేంద్రంలో ఆరు నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపట్టారు. చిల్డ్రన్ పార్క్లో రెండు నర్సరీలను ఏర్పాటు చేసి ఫిబ్రవరి చివరి నుంచే మొక్కల పెంపకం చేపట్టారు. మొత్తం 3లక్షల 20 వేల మొక్కల పెంపకం లక్ష్యంగా కాగా..ఒక్కో నర్సరీలో 50 వేలకు పైగా మొక్కలు పెంపకం చేపట్టారు.
గ్రీన్ఫండ్తో ..
మున్సిపాలిటీలకు వచ్చే అభివృద్ధి నిధుల్లో 10 శాతం హరితహారానికి ఖర్చు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మెదక్తో పాటు రామాయంపేట, తూప్రాన్, నర్సాపూ ర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.వాటికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సంఘం నుంచి అభివృద్ధి కోసం నిధులు విడుదలవుతాయి.రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సం ఘం నిధులు ఇస్తున్నది. పట్టణ ప్రగతి ద్వారా ప్రత్యేక నిధులను మున్సిపాలిటీలకు సమకూర్చుతున్నది. ఈ నిధు లు మున్సిపాలిటీల జనాభా ఆధారంగా మున్సిపల్ ఖాతాలో జమ చేస్తున్నారు. ఈ నిధుల్లో నుంచి 10 శాతం హరితహారానికి మాత్రమే ఖర్చు చేయాలి. అలా కాకుండా వేరే వాటికి ఈ నిధులను ఖర్చు చేయరాదు. చేస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు.
పచ్చదనాన్ని పెంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది..
హరితహార కార్యక్రమానికి సిద్ద్ధగా ఉన్నాం. పట్టణంలో మొక్కలు నాటేందుకు ఇప్పటికే ఖాళీ స్థలాలు గుర్తించాం. ఇంటి ఆవరణలో స్థలం ఉన్నవారికి పండ్లు, పూల మొక్కలను 5 నుంచి 6 వరకు పంపిణీ చేస్తాం.
మొక్కలు సిద్ద్ధం..
ఏడో విడుత హరితహారం కోసం నర్సరీల్లో మొక్క లు సిద్ధం చేశాం. ముఖ్యమంత్రి జూలై 1 నుంచి హరితహారం కార్యక్రమం చేపట్టాలని ప్రకటించా రు. ఆ రోజు నుంచి ఘనంగా నిర్వహిస్తాం. పట్టణంలో ఏర్పాటు చేసిన 6 నర్సరీల్లో 3 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి.
-శ్రీహరి, మున్సిపల్ కమిషనర్ మెదక్
ఆకుపచ్చని తెలంగాణగా మార్చేందుకు శ్రీకారం:మెదక్ ఎంపీడీవో శ్రీరాములు
ఆకుపచ్చ రాష్ర్టంగా మార్చేందుకు ప్ర భుత్వం హరితహారం కార్యక్ర మం చేపడుతున్నట్లు ఎంపీడీవో శ్రీరాము లు అన్నారు బుధవారం మండలంలోని మాగ్దుంపూర్ పంచాయతీలో ఎంపీడీవో ఏడో విడత హరితహారంలో భాగంగా గ్రామంలో మొక్కలను నాటి టీ గార్డులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో 10 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికను రూపొందించామన్నారు. సర్పంచ్ కళావతి , ఉపసర్పంచ్, పంచాయతీకార్యదర్శి నవీన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అరవింద్ ఉన్నారు.
పచ్చదనం పెంపొందించడంమే లక్ష్యం
పచ్చదనం పెంపొందించడంమే లక్ష్యంగా ప్రభుత్వం హారితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నదని సర్పంచ్ సిద్ధ్దాగౌడ్ అన్నారు. రా యినిపల్లిలో సర్పంచ్ సిద్ధాగౌడ్, ఎంపీటీసీ శ్రీహరి, ఏడోవిడత హరితహారం మొక్కలు నాటడం కోసం గుంతలు తీశారు. కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి నవనీత , ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.