మనోహరాబాద్, మే 18: ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నామని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డి అన్నారు. మనోహరాబాద్లో 500 లారీల ధాన్యం నిల్వ చేసే కెపాసిటీ గల ప్రైవేట్ గోదాంను మంగళవారం ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్లులకు తరలించే ధాన్యం లారీలు లైన్ ఉండి రైస్మిల్లుల వద్దనే ఉండిపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడి ధాన్యం అక్కడే ఉండిపోయింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మనోహరాబాద్, తూప్రాన్, శివ్వంపేట మండలాల తహసీల్దార్లు, పోలీసు అధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసిన అనంతరం మనోహరాబాద్ మండలంలోని పలు ప్రైవేట్ గోదాంలను పరిశీలించారు.
మూడు మండలాల్లోని కొనుగోలు కేం ద్రాల వద్ద సేకరించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అనువుగా ఉండి, 500 లారీల ధాన్యం నిల్వ చేయగల అతిపెద్ద గోదాంను ఎంపిక చేశారు. గోదాం నిర్వాహకులతో మా ట్లాడి మంగళవారం సాయంత్రం నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాంలోకి తరలిస్తున్నారు. జడ్పీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీసు అధికారులు లారీల నిర్వాహకులతో చర్చించి కొనుగోలు కేంద్రాల వద్దకు లారీలను పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద సేకరించిన ధాన్యాన్ని రైతువేదికల్లో నిల్వ చేయిస్తున్నా మన్నారు. సమావేశంలో మండల ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి, తహసీల్దార్లు భిక్షపతి, శ్రీదేవి, ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, వైస్ ఎంపీపీ విఠల్రెడ్డి, సీఐ స్వామిగౌడ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్రెడ్డి, నాయకులు ఇమాంపూర్ శేఖర్గౌడ్, వెంకట్గౌడ్ పాల్గొన్నారు.