ఉద్యమంలా ఉపాధి పనులు
పని చేసే ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణ చర్యలు
కూలీల వద్దకే మెడికల్ కిట్లు
రామాయంపేట, మే 9 : రామాయంపేట, నిజాంపేట మండలాల పరిధిలోని దామర చెర్వు, నందిగామ, కల్వకుంట, సుతారిపల్లి, తొనిగండ్ల, చల్మెడ, శివ్వాయ పల్లె తదితర గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ఉద్యమంలా కొనసాగుతున్నాయి. ఉమ్మడి రెండు మండల్లాల్లోని గ్రామాల్లో చెరువు పనుల్లో భాగంగా ఉపాధి హామీ కూలీలతో ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ దేమ శశిరేఖ.. వాటర్ డ్రింకింగ్ ట్యాంకు పనులు చెరువుల పూడికతీత, కట్టల వెడల్పు, ముళ్లపొదల తొలగింపు తదితర పనులను చేపడ్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనులను చేయిసున్నారు. వేసవిలో కూలీలకు పనులు లేనందున ప్రభుత్వం తాగునీటి వసతి కల్పించేందు కోసం చెరువులోనే కూలీలతో వాటర్ ట్యాంకు పనులను చేపడుతున్నది. ఉపాధి పనుల తోపాటు చెరువులోకి వెళ్లడానికి రోడ్డు పనులు కూడా చేపడుతున్నారు. ఈ ఉపాధి పనులకు గ్రామంలోని జాబ్ కార్డులు ఉన్న వారందరితోనూ ఈజీఎస్ సిబ్బంది పనులను చేయిస్తున్నారు. కూలీలకు వడదెబ్బ తగలకుండా పని చేసే ప్రాంతాల్లోనే టెంట్లు వేసి అక్కడ నీరు, మందులను అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కూలీలు ఏవైనా ఆరోగ్య పర మైన ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు సమాచారం చేరవేయాలని కూడా ఉపాధి అధికారులు మేట్లను ఆదేశించారు.
జాబ్కార్డు ఉన్నవారందరికీ ఉపాధి
జాబ్కార్డు ఉన్నవారికి తప్పకుండా ఉపాధి పనులను కల్పిస్తు న్నాం. గ్రామంలో ఏ ఒక్కరూ ఇంటి వద్ద ఉండ కుండా ఉపాధి పనులకు ప్రరోజు వస్తున్నారు. కూలీ లకు ఆరోగ్యపరంగా ఇబ్బం దులు కలుగకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటు న్నాము.
– శంకర్, ఏపీవో రామాయంపేట
కూలీలకు సరిపడా కూలి..
ఉపాధి పనులకు వచ్చే కూలీలకు సరిపడా కూలి ఇస్తు న్నాం. ప్రభుత్వం కూడా వెం టనే డబ్బులను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నది. డబ్బు ల విషయంలో వారికెలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బ్యాంకులో జమ చేస్తు న్నాం. – శశిరేఖ, టెక్నికల్ అసిస్టెంట్, నిజాంపేట