మెదక్, ఏప్రిల్ 9: ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దిందని, దీనిద్వారా భూముల కొనుగోలు అమ్మకం సులభతరమైందని మెదక్ కలెక్టర్ హరీశ్ అన్నారు. ధరణి పోర్టల్లో వచ్చిన వివిధ భూ సమస్యల గురించి శుక్రవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో అన్ని మండలాల డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ధరణి ఆపరేటర్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యుటేషన్ కోసం భూములు, ఆస్తుల హక్కుల మార్పిడీ కోసం భూ యజమానులు మీ సేవలో చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి ఎందుకు పెండింగ్లో పెట్టారో మూలాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. ధరణి పార్ట్-బీలో మ్యుటేషన్ సర్వే నంబర్ మిస్సింగ్ రికార్డులను సవరించుటకు వచ్చిన అన్ని ఫిర్యాదులను త్వరితగతిన పరిశీలించి పరిష్కరిస్తే అటు ప్రజలు ఆనందపడడమే కాక ఇటు జిల్లాకు మంచి పేరు వస్తుందని, కాబట్టి ఈ మూడు నెలలు మరింత కష్టపడాలని కోరారు. ఏదైనా సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్, తూప్రాన్, నర్పాపూర్ ఆర్డీవోలు శ్యాంప్రకాశ్, రవీందర్రెడ్డి, అన్ని మండలాల డిప్యూటీ తహసీల్లార్లు, సీనియర్ అసిస్టెంట్లు, ధరణి ఆపరేటర్లు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
ఢిల్లీ ఎయిమ్స్లో 35 మంది వైద్యులకు కరోనా
బడి మానేసి ట్రేడింగ్.. నేడు యువ కుబేరుడు
భూమిలో దొరికిన గుప్తనిధులు ఎవరికి సొంతం.. పంపకాలు ఎలా జరుపుతారు?