మెదక్రూరల్ , ఏప్రిల్ 7: రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ డివిజనల్ అధికారి నగేశ్ అన్నారు. బుదవారం మెదక్ ఎంపీడీవో కార్యాలయంలో హార్వెస్టింగ్ ధాన్యం సేకరించే మిల్లర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నగేశ్, మెదక్ మాచవరం పీఏసీఎస్ చైర్మన్లు హన్మంతరెడ్డి, సీతారామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు యంత్రాల ద్వారా ధాన్యం కోసి కల్లాల దగ్గరే శుద్ధిచేసి ఎఫ్సీఐ నిబంధనల మేరకు ధాన్యంలో తేమ 17శాతానికి మించకుండా, తాలు లేకుండా ధాన్యం తీసుకురావాలన్నారు. వరి కోత సమయంలో ఫ్యాన్ను తప్పకుండా నడపాలన్నారు. సమావేశంలో ఎంపీడీవో శ్రీరాములు, మండల వ్యవసాయాధికారి లక్ష్మీప్రవీణ్, సర్పంచ్లు సిద్ద గౌడ్, నర్సింహులు, ఏఈవోలు శేఖర్, రాజశేఖర్, భార్గవి పాల్గొన్నారు.