మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి
చేగుంట, జూన్ 6 : ఐకేపీ, సొసైటీల ద్వారా ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని 24 గంటల్లో మార్కెట్యార్డు గోదాంలకు తరలించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. చేగుంట, నార్సింగి రెండు మండలాల్లో సుమారు ఇప్పటి వరకు 4 లక్షల 34 వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశామని, ఇంకా కేంద్రాల్లో ఉన్న 55 వేల 150 క్వింటాళ్ల ధాన్యాన్ని 24గంటల్లో మార్కెట్యార్డుకు తరలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. చేగుంట మండల ఐకేపీ ద్వారా సుమారు ఒక లక్ష 65 వేల క్వింటాళ్లు, ఇబ్రహీంపూర్ సొసైటీ ద్వారా లక్ష10 వేలు, రెడ్డిపల్లి సొసైటీ ద్వారా 28 వేలు, చేగుంట సొసైటీ ద్వారా 22వేలు, నార్సింగి ఐకెపీ ద్వారా 80 వేలు, సొసైటీ ద్వారా 29 వేల క్వింటాళ్లను కొనుగోలు చేశామన్నారు. దేశంలో రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.
కేంద్రాల్లో నిలిచిన ధాన్యాన్ని వెంటనే గోదాంలకు తరలించే విధంగా కృషి చేస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమం లో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, జడ్పీటీసీ ముదాం శ్రీనివాస్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ రజనక్ ప్రవీణ్ కుమార్, వైస్ చైర్మన్ ఎన్నం రాజేందర్రెడ్డి, మండల సర్పచ్ల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, సొసైటీ చైర్మన్లు సండ్రుగు స్వామి, వంటరి కొండల్రెడ్డి, మ్యాకల పరమేశ్, శంకర్గౌడ్,సొసైటీ డైరెక్టర్ అయిత రఘురాములు, టీఆర్ఎస్ పట్టణశాఖాధ్యక్షుడు ఎర్ర యాదగిరి, స్థానిక నాయకులు రంగాయ్యగారి రాజిరెడ్డి, అంచనూరి రాజేశ్, తౌర్యనాయక్, చిందం రవీందర్, రైస్మిల్లర్స్ తదితరులు ఉన్నారు.
సహాయనిధి పేదలకు వరం
సీఎం సహాయనిధి నిరుపేదలకు ఓ వరం లాంటిదని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మండల కేంద్రమైన చేగుంటకు చెందిన షహేనాబేగం ఇటీవల అనారోగ్యానికి గురై సీఎం సహాయనిధికి దరాఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ. 60 వేల చెక్కును చేగుంటలో అందజేశారు.
బాధిత కుటుంబాలకు ఎంపీ పరామర్శ
ఇటీవల మృతి చెందిన టీఆర్ఎస్ నాయకుడు నార్సింగికి చెందిన కాజిపల్లి మల్లేశ్ యాదవ్, బీంరావ్పల్లి మాజీ సోసైటీ వైస్ చైర్మన్ కుటుంబాలను ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ఆదివారం పరామర్శించి, ఫ్రగాడ సానుభూతిని వ్యక్తం చేశారు.